AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు టీమిండియా తోపు క్రికెటర్.. ఇప్పుడు 1300 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్..

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఒక దర్శకుడి పేరు మారుమోగుతుంది. అతడు తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన ఒక మూవీ థియేటర్లలో ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతుంది. ఇంతకీ అతడు ఎవరు.. ? క్రికెట్ తో తనకున్న సంబంధం ఏంటో తెలుసుకుందామా..

Tollywood : అప్పుడు టీమిండియా తోపు క్రికెటర్.. ఇప్పుడు 1300 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్..
Aditya Dhar
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2026 | 7:52 AM

Share

సాధారణంగా భారతీయ సినీ పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. కంటెంట్.. డైరెక్షన్.. మేకింగ్ స్టైల్ తో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ డైరెక్టర్ సైతం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నారు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. అతడు దర్శకత్వం వహించిన ‘ధురంధర్’ చిత్రం డిసెంబర్ 5, 2025న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. బీటౌన్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ నటించిన ఈ స్పై-యాక్షన్ చిత్రం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ‘పఠాన్’ , ‘జవాన్’ వంటి మెగా హిట్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

ఇక ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ హిమాలయ విజయం వెనుక నిరాశపరిచే క్రికెట్ కల దాగి ఉంది. ఆదిత్య ధర్ తన తొలినాళ్లలోనే ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా ఎదిగాడు. కానీ, అతను అండర్-19 జట్టులో చోటు సంపాదించబోతున్న సమయంలో, కొన్ని కారణాల వల్ల అతన్ని జట్టు నుండి తొలగించారు. ఈ నిరాశ అతన్ని ఇంట్లో ఉన్నప్పుడు ‘కార్దిష్’ సినిమా చూసేలా చేసింది.అతనిలో సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించింది. వెంటనే ముంబైకి వచ్చేలా చేసింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర మూడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. క్రికెట్‌లో నిరాశ చెందినప్పటికీ, నేడు అతను రూ. 1300 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రానికి హీరోగా మారాడు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆధిత్య ధర్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. తెలుగులో కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

Follow Us