AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs DC: ఫ్యాన్స్ ని సప్రైజ్ చేయనున్న CSK! గైక్వాడ్ గాయంతో మళ్ళీ పగ్గాలు చేపట్టనున్న తలా?

ఐపీఎల్ 2025లో చెన్నైకి మళ్లీ ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గైక్వాడ్ గాయంతో ఆటకు దూరమవడంతో, ధోనికి పగ్గాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైకు MA చిదంబరం స్టేడియంలో ఢిల్లీపై రికార్డు మెరుగ్గా ఉంది. శనివారం మ్యాచ్ ముందు ధోని నాయకత్వం పునరాగమనం ఆసక్తికరంగా మారింది.

CSK vs DC: ఫ్యాన్స్ ని సప్రైజ్ చేయనున్న CSK! గైక్వాడ్ గాయంతో మళ్ళీ పగ్గాలు చేపట్టనున్న తలా?
Dhoni Ipl Csk
Narsimha
|

Updated on: Apr 05, 2025 | 9:50 AM

Share

ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మలుపు తిరుగుతోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మళ్లీ ఎంఎస్ ధోని చెన్నైకి నాయకత్వం వహించే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో, జట్టుకు మరో ప్రత్యామ్నాయ కెప్టెన్ అందుబాటులో లేకపోవడంతో, ధోని మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే వేసిన బంతి గైక్వాడ్ కుడిచేతికి తగలడం వల్ల అతను శిక్షణలో పాల్గొనలేదు. గాయం తీవ్రత ఇంకా నిర్ధారణలో లేకపోయినా, మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకుంటామని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ.

హస్సీ మాట్లాడుతూ, “అయన ఈ రోజు బ్యాట్ తీసుకొని శిక్షణలో పాల్గొనాలని ప్రయత్నించాడు. అతని చేతికి నొప్పి ఇంకా కొంత ఉన్నా, రోజురోజుకూ మెరుగవుతోంది. రేపాటి మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము,” అని చెప్పారు. కెప్టెన్సీ ఎవరికి అప్పగించబోతున్నారు అనే ప్రశ్నకు హస్సీ తేలికగా ధోనిని సూచిస్తూ సమాధానమిచ్చారు. “మన దగ్గర ఒక యువకుడు ఉన్నాడు, అతను స్టంప్స్ వెనుక ఉంటాడు. బహుశా అతను మంచి పని చేయగలడు. కానీ నిజం చెప్పాలంటే నాకు ఖచ్చితంగా తెలియదు,” ధోనిపై పరోక్షంగా ప్రస్తావించారు.

మరోవైపు, మ్యాచ్ జరగనున్న MA చిదంబరం స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే వాతావరణంతో బ్యాటింగ్కు కొంత కష్టంగా ఉంది మారే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం ఉండకపోవచ్చు, టాస్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మక బౌలింగ్, శ్రద్ధతో కూడిన బ్యాటింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

ఇంకో వైపున చూస్తే, చెపాక్ వేదికపై చెన్నైకు ఢిల్లీపై బలమైన హిస్టరీ ఉంది. ఇప్పటివరకు జరిగిన 30 మ్యాచ్‌లలో CSK 19 విజయాలను సాధించగా, DC కేవలం 11 మ్యాచులే గెలిచింది. అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం ఢిల్లీ జట్టు మరింత మెరుగుపడింది. DC మరో విజయం సాధిస్తే వారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. ఇది CSKకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌గా మారింది, ఎందుకంటే వీరి పతనం ఇప్పటికే మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ధోని మళ్లీ కెప్టెన్సీ చేపడతారా? లేక గైక్వాడ్ గాయాన్ని అధిగమించి జట్టుకు నడిపించగలడా? అనే ప్రశ్నలు శనివారం మ్యాచ్‌కు ముందు తేలనున్నాయి. అభిమానులు మాత్రం చెపాక్ వేదికపై మళ్లీ ధోని నాయకత్వాన్ని చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నో విజయాలు అందించిన ఈ లెజెండరీ కెప్టెన్, మరోసారి తాను ఎందుకు ప్రత్యేకమో రుజువు చేస్తాడా అనే ఆసక్తికర ప్రశ్నకు సమాధానం త్వరలోనే రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..