AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: భారత్‌లో అత్యధిక టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టు ఏంటో తెలుసా.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారంతే?

India vs New Zealand: భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి చారిత్రాత్మక సిరీస్‌ను నమోదు చేసింది. ఈ సిరీస్ విజయంతో కివీస్ భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచిన ప్రపంచంలో 6వ జట్టుగా అవతరించింది.

Team India: భారత్‌లో అత్యధిక టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టు ఏంటో తెలుసా.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారంతే?
Team India Test Series
Venkata Chari
|

Updated on: Oct 27, 2024 | 12:24 PM

Share

India vs New Zealand: భారత్‌లో కేవలం 6 జట్లు మాత్రమే టెస్టు సిరీస్‌లను గెలుచుకున్నాయి. ఈ ఆరు జట్లపై టీమ్ ఇండియా స్వదేశంలో 17 సార్లు ఓడిపోయింది. వీటిలో మూడు జట్లు మూడుసార్ల కంటే ఎక్కువే దక్కించుకున్నాయి. మిగతా మూడు జట్లు మాత్రం కేవలం ఒక్కసారే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే భారత్‌లో అత్యధిక టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న జట్టు ఏది? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో…

వెస్టిండీస్: భారత్‌లో అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్లలో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉంది. టీమిండియా టెస్టు కెరీర్‌ తొలినాళ్లలో వెస్టిండీస్‌ జట్టు సక్సెస్ అయింది. ఫలితంగా 1948, 1958, 1966, 1974, 1983లో స్వదేశంలో టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది.

ఇంగ్లండ్: వెస్టిండీస్ తర్వాత స్వదేశంలో భారత్‌పై ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ 1933లో తొలిసారిగా భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1974, 1979, 1984, 2012లో విజయం సాధించింది.

ఆస్ట్రేలియా: వెస్టిండీస్, ఇంగ్లండ్ తర్వాత స్వదేశంలో టీమిండియాను ఓడించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా 1956, 1959, 1969, 2004లో భారత్‌లో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది.

పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్: భారత్‌లో ఒకే ఒక్క టెస్టు సిరీస్ గెలిచిన జట్ల జాబితాలో పాకిస్థాన్ (1986) అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (1999) తర్వాతి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (2024) ఇప్పుడు ఈ జాబితాలో చేరింది.

అంటే, భారత్‌లో అత్యధిక టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా వెస్టిండీస్, ఇంగ్లండ్‌లు రికార్డు సృష్టించాయి. ఈ జట్లు మొత్తం 5 సార్లు భారత్‌లో సిరీస్‌లను సొంతం చేసుకున్నాయి.

భారత్‌లో టెస్టు సిరీస్ గెలవని దేశాలు:

శ్రీలంక

బంగ్లాదేశ్

ఐర్లాండ్

ఆఫ్ఘనిస్తాన్

జింబాబ్వే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..