
Team India Players Retirement News: టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్న నేపథ్యంలో గతంలో జట్టుకు కీలకంగా నిలిచిన కొంతమంది సీనియర్ క్రికెటర్లు తమ అంతర్జాతీయ కెరీర్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇలాంటి ఆటగాళ్లు ఎవరు, ఎందుకు రిటైర్మెంట్ చేయబోతున్నారనే సంగతి ఇప్పుడు చూద్దాం..
టీమిండియా అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత టెస్ట్ క్రికెట్లో కీలక పాత్ర పోషించాడు. అతను 105 టెస్ట్ మ్యాచ్లు ఆడి 311 వికెట్లు తీసి భారత అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా నిలిచాడు. అలాగే 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు సాధించాడు. అయితే గత కొన్నేళ్లుగా జట్టులో చోటు లేకపోవడంతో త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. యువ పేసర్లు జట్టులోకి రావడంతో అతనికి అవకాశాలు తగ్గాయి. గత కొన్ని సంవత్సరాలుగా అతను భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.
స్వింగ్ బౌలింగ్లో నైపుణ్యం కలిగిన భువనేశ్వర్ కుమార్ భారత వైట్ బాల్ క్రికెట్లో కీలక పాత్ర పోషించాడు. అతను 21 టెస్ట్ మ్యాచ్లలో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20ల్లో 90 వికెట్లు సాధించాడు. అయితే 2022 తర్వాత భారత జట్టులో అవకాశాలు తగ్గడంతో త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే భారత టెస్ట్ జట్టుకు ఒకప్పుడు ప్రధాన స్తంభంగా నిలిచాడు. అతను 85 టెస్ట్ మ్యాచ్లలో 5077 పరుగులు, 90 వన్డేల్లో 2962 పరుగులు చేశాడు. రహానే నాయకత్వంలో భారత జట్టు విదేశాల్లో కొన్ని చారిత్రక విజయాలు సాధించింది. ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గడంతో ఆయన కూడా త్వరలో తన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికే అవకాశముంది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మనీష్ పాండే కూడా భారత జట్టుకు సేవలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. అతను 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్గా కూడా గుర్తింపు పొందాడు. కానీ గత కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు లేకపోవడంతో ఆయన కూడా త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.
ఈ ఐదుగురు ఆటగాళ్లు గతంలో భారత జట్టుకు కీలక సేవలు అందించారు. వారు నిజంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా క్రికెట్లో ఒక ముఖ్యమైన యుగానికి ముగింపు పలికినట్లే అవుతుంది. అదే సమయంలో కొత్త తరానికి అవకాశాలు పెరగడం భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచిదని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..