AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బంగారం లాంటోడిని తీసేసి, ఐరెన్ లెగ్‌ను తెచ్చుకున్నారేంది గంభీర్..: టీమిండియా మాజీ ప్లేయర్

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఆడిన రెండు వన్డే సిరీస్‌ల్లోనూ ఓటమి ఎదురైంది. దీంతో గిల్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే, రోహిత్ శర్మకు తిరిగి వన్డే కమాండ్ ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Team India: బంగారం లాంటోడిని తీసేసి, ఐరెన్ లెగ్‌ను తెచ్చుకున్నారేంది గంభీర్..: టీమిండియా మాజీ ప్లేయర్
Rohit Shamra Team India
Venkata Chari
|

Updated on: Jan 22, 2026 | 2:17 PM

Share

భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, తిరిగి రోహిత్ శర్మను నియమించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి సూచించారు. 2025, అక్టోబర్ 4న రోహిత్ స్థానంలో గిల్ కెప్టెన్ అయ్యాడు. అయితే, గిల్ నాయకత్వంలో ఆడిన రెండు వన్డే సిరీస్‌లలోనూ భారత్ ఓటమి పాలైంది.

అక్టోబర్ 19, 2025న ఆస్ట్రేలియాలో గిల్ తన కెప్టెన్సీ ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడ వరుస ఓటముల తర్వాత, సిడ్నీలో రోహిత్ సెంచరీ చేయడంతో భారత్ వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. అనంతరం మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌కు గిల్ దూరమయ్యాడు. గత వారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మళ్ళీ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్, జట్టుకు 1-2తో ఘోర ఓటమిని మిగిల్చాడు.

న్యూజిలాండ్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో భారత్ ఓడిపోవడంతో గిల్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ (InsideSport) తో జరిగిన సంభాషణలో గిల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలా అని అడిగిన ప్రశ్నకు తివారీ అవునని సమాధానమిచ్చాడు.

“అవును, ఖచ్చితంగా తొలగించాలి. తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టే నేను ఈ సూచన చేస్తున్నాను. ఇది కేవలం ఏదో ఒక ద్వైపాక్షిక సిరీస్ లేదా సాధారణ టోర్నమెంట్ గురించి కాదు, ఇది వరల్డ్ కప్ గురించి,” అని తివారీ తెలిపాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండి ఉంటే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

“రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించాల్సిన అవసరం ఏముంది? రోహిత్ గనుక ఈరోజు వన్డే జట్టును నడిపించి ఉంటే, ఫలితం ఖచ్చితంగా మరోలా ఉండేది. ఆయన సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు జట్టు సరైన దిశలోనే వెళ్తోందని నేను భావిస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నాడు.

“ప్రస్తుతం శుభ్‌మన్ కంటే రోహిత్ కొంచెం కాదు, చాలా మెరుగైన కెప్టెన్. అందుకే ఆయన అంత విజయవంతమయ్యాడు. శుభ్‌మన్ కెప్టెన్సీలోనూ మీరు వరల్డ్ కప్ గెలవవచ్చు, కానీ ఇద్దరినీ పోల్చి చూస్తే.. రోహిత్ కెప్టెన్‌గా ఉంటే గెలిచే అవకాశాలు 85 నుంచి 90 శాతం వరకు ఉంటాయి. గిల్ కంటే రోహిత్ నాయకత్వంలోనే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు,” అని తివారీ తన తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..