World Championship : యువరాజ్, ధావన్, రైనాలంటేనే మండిపడుతున్న అభిమానులు.. కారణం ఇదే !
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ తర్వాత కూడా యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా వంటి భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లతో కలిసి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో ఆడటంపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

World Championship : ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అనే టీ20 లీగ్ భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. ఈ లీగ్లో భారత మాజీ ఆటగాళ్లు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లతో కలిసి ఆడటంపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ లీగ్ జూలై 18న ప్రారంభమైంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల మాజీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. గతంలో 2024లో కూడా ఈ లీగ్ జరిగింది. అప్పుడు యువరాజ్ సింగ్ నాయకత్వంలో భారత్ పాకిస్థాన్ను ఓడించి గెలిచింది.
అయితే, ఈసారి అభిమానులు కోపంగా ఉండటానికి కారణం వేరే ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత మే 7 నుండి 10 వరకు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం. పహల్గామ్లో పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధుర్ ను చేపట్టి, పాకిస్థాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.
ఈ ఘర్షణల సమయంలో షహీద్ అఫ్రిది వంటి పాకిస్థాన్ క్రికెటర్లు భారత్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో శిఖర్ ధావన్ అఫ్రిదికి గట్టిగా బదులిచ్చి తన దేశభక్తిని చాటుకున్నాడు. కానీ, ఆపరేషన్ సింధుర్ జరిగిన కేవలం 2 నెలల తర్వాత, శిఖర్ ధావన్ అదే షహీద్ అఫ్రిదితో కలిసి ఒకే మైదానంలో ఆడటానికి సిద్ధమయ్యాడు. ధావన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్రముఖ భారత మాజీ ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్లో అఫ్రిది, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ వంటి పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసి ఆడనున్నారు. దీనిపై భారత అభిమానులు.. ఇప్పుడు మీ దేశభక్తి ఏమైంది? అని ప్రశ్నిస్తూ ఈ స్టార్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Indian ex cricketers like Harbhajan, Yuvraj & Dhawan are happily playing WCL matches vs Pakistan in a private league! But when it’s public, they scream nationalism. Why does the Govt stay silent? Is deshbhakti only for common people, not celebs? Hypocrisy much? https://t.co/aelQzXKJNC
— Cricket for her (@coverdrivetoher) July 18, 2025
World champions league is starting today involving India and Pakistan teams. From India we have likes of irfan, Yusuf, Yuvraj, Rayudu, shikhar dhawan. How is this justified ? Why are they playing against Pakistan.@BCCI @JayShah #worldchampionsleague
— Ankur Patel (@Seldomcooker1) July 18, 2025
క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాకుండా, దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కలిసి ఆడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




