AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కోహ్లీ, కృనాల్ కాదంట.. ఆర్‌సీబీ డార్క్ హార్స్ ఇతనే..

Virat Kohli Praises RCB Dark Horse Win: ఆర్‌సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సుయాష్ శర్మ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, పాండ్యా మధ్య బలమైన భాగస్వామ్యం జట్టుకు విజయం అందించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2025లో ఏడో విజయాన్ని నమోదు చేసింది.

IPL 2025: కోహ్లీ, కృనాల్ కాదంట.. ఆర్‌సీబీ డార్క్ హార్స్ ఇతనే..
Rcb
Venkata Chari
|

Updated on: Apr 28, 2025 | 1:36 PM

Share

RCB Suyash Sharma Dark Horse IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు విజయాల ప్రచారం కొనసాగుతోంది. RCB వారి సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, 10వ మ్యాచ్‌లో ఏడవ విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో తొలిసారి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కృనాల్ పాండ్యాతో కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, విజయం తర్వాత, కోహ్లీ ఓ ప్లేయర్‌ను ఆర్‌సీబీ డార్క్ హార్స్‌ అంటూ చెప్పుకొచ్చాడు. పాండ్యా, రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్లను కాకుండా స్పిన్నర్ సుయాష్ శర్మను ఆర్సీబీ డార్క్ హార్స్ అంటూ పిలవడం గమనార్హం.

ఆర్‌సీబీ డార్క్ హార్స్‌..

బెంగళూరు జట్టులో స్పిన్నర్ సుయాష్ శర్మ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు అతను ఆర్‌సీబీ తరపున తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని అందించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విజయం తర్వాత విరాట్ కోహ్లీ సుయాష్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘ సుయాష్ మా జట్టులో డార్క్ హార్స్ (చీకటి గుర్రం). అతను వికెట్లు తీయకపోయినా, దాడి చేస్తూనే ఉన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: 8 ఫోర్లు, 6 సిక్సర్లు.. 2 ఓవర్లలో 94 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే వైల్డ్ ఫైర్ ఓవర్.. బౌలర్లకు రక్త కన్నీరే భయ్యో

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ ఖాతాలో ఏడో విజయం..

మ్యాచ్ గురించి మాట్లాడితే, ఢిల్లీ తరపున కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 3 ఫోర్లతో అత్యధికంగా 41 పరుగులు చేశాడు. దీంతో అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆర్‌సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత, ఆర్‌సీబీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో, కృనాల్ పాండ్యా నాల్గవ వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత కోహ్లీ 47 బంతుల్లో నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ, కృనాల్ పాండ్య జట్టుకు ఏడో విజయాన్ని అందించిన తర్వాతే మైదానం నుంచి తిరిగి వచ్చాడు.

ఇది కూడా చదవండి: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే.. లక్ మార్చిన ఐపీఎల్ 2025.. టీమిండియాలోకి రీఎంట్రీ

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..