Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: విరాట్ నుంచి రచిన్ రవీంద్ర వరకు.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు.. వీడియో

ప్రస్తుతం రోహిత్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు కీలక ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అదే సమయంలో, చాలా మంది మాజీ ఆటగాళ్ళు కూడా ట్రోఫీని గెలవడానికి మెన్ ఇన్ బ్లూ బలమైన పోటీదారులు అని నమ్ముతారు. అయితే, ఇటీవల నాకౌట్ మ్యాచ్‌లలో జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ జట్టు టైటిల్ చేరడం అంత సులువు కాదు.

Diwali 2023: విరాట్ నుంచి రచిన్ రవీంద్ర వరకు.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు.. వీడియో
Diwali 2023
Follow us
Venkata Chari

|

Updated on: Nov 11, 2023 | 9:13 PM

Diwali 2023: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ప్రపంచ కప్ 2023 (CWC 2023) థ్రిల్‌ను ఆస్వాదించడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత జట్టు (Team India) అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఎంతగానో అలరించింది. నవంబర్ 12న జరిగే టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇండియా, నెదర్లాండ్స్ (IND vs NED) మధ్య మ్యాచ్ జరగనుంది. దీపావళి పండుగ కూడా అదే రోజున భారతదేశంలో సెలబ్రేట్ చేస్తుంటారు. ఇందుకోసం భారత ఆటగాళ్లతో పాటు విదేశీ జట్ల ఆటగాళ్లు కూడా ముందుగా భారత అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

శనివారం, స్టార్ స్పోర్ట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ముందుగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్, బెన్ స్టోక్స్, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, జో రూట్ కూడా అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి తన విభిన్న శైలిలో పంజాబీ మాట్లాడుతూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వీడియోను చూడండి:

10 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుకు స్వస్తి పలకాలనుకుంటోన్న రోహిత్ శర్మ..

వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌ టైటిల్‌ను గెలుచుకునేందుకు టీమ్‌ఇండియా కేవలం రెండడుగుల దూరంలో ఉంది. చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీని గెలవలేని భారత కరువును తుదముట్టించడంలో హిట్‌మ్యాన్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని లక్షలాది మంది భారతీయ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం రోహిత్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు కీలక ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అదే సమయంలో, చాలా మంది మాజీ ఆటగాళ్ళు కూడా ట్రోఫీని గెలవడానికి మెన్ ఇన్ బ్లూ బలమైన పోటీదారులు అని నమ్ముతారు. అయితే, ఇటీవల నాకౌట్ మ్యాచ్‌లలో జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ జట్టు టైటిల్ చేరడం అంత సులువు కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..