ఐపీఎల్ 16వ సీజన్ చివరి బంతికి మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ధోనీ నాయకత్వంలో చెన్నై ఐదోసారి ఛాంపియన్గా నిలిచింది. కానీ 17వ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై ప్లేఆఫ్కు చేరుకోలేకపోయింది. ఆర్సీబీతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో చెన్నై ఓడిపోవాల్సి వచ్చింది. చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో ఈ సీజన్ పోరాటాన్ని ముగించింది. శనివారం మ్యాచ్ లో రవీంద్ర జడేజా సహకారంతో చెన్నైని విజయపథంలో నడిపించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ధోనీ ఔట్ కావడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ లో చెన్నై ప్రయాణం ముగిసిన తర్వాత ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని రిటైర్మెంట్ గురించి చాలా చర్చలు జరిగాయి.
మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ధోనీ మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య కారణంగా ధోనీ టాప్లో బ్యాటింగ్ చేయలేదు. రన్నింగ్లో ధోనీ కూడా ఇబ్బంది పడ్డాడు. మరోవైపు, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ సహచరుడు సురేష్ రైనా ఇద్దరూ ధోని మరో సీజన్ ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇది తన కెరీర్లో చివరి దశ అని ధోనీ గత సీజన్లో చెప్పాడు. అలాగే, కేకేఆర్తో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ధోనీ అభిమానులకు మద్దతుగా ధన్యవాదాలు తెలిపాడు. దీంతో ధనాధాన్ లీగ్ లో ధోని ఆఖరి మ్యాచ్ ఆడేశాడని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024
కాగా, మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో 264 మ్యాచ్లు ఆడాడు. 137.54 స్ట్రైక్ రేట్ 39.13 సగటుతో 5, 243 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఓవరాల్ గా 363 ఫోర్లు, 252 సిక్సర్లు బాదాడు.
Even through the tough times,
You’ve been with us.
Until We meet again, Superfans! 💛#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/TA9yRIRdzH— Chennai Super Kings (@ChennaiIPL) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..