AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఇకపై కొత్త పాత్రలో ధోని.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో అయోమయంలో చెన్నై ఫ్యాన్స్..

IPL 2024: ఎంఎస్ ధోని తన ఫేస్‌బుక్ పోస్ట్‌తో అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. ఈ సీజన్ కోసం ఇక వేచి ఉండలేనంటూ ఓ పెద్ద ప్రశ్నను అభిమానులకు అందించాడు. రాబోయే సీజన్‌లో ధోని కొత్త పాత్రలో కనిపించనున్నట్లు అందులో సారాంశం. దీంతో ఫ్యాన్స్ అంతా అదేంటో అని సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు.

MS Dhoni: ఇకపై కొత్త పాత్రలో ధోని.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో అయోమయంలో చెన్నై ఫ్యాన్స్..
Ms dhoni Ipl Records
Venkata Chari
|

Updated on: Mar 05, 2024 | 7:20 AM

Share

CSK Captain MS Dhoni New Post: ఐపీఎల్ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందు, ఎంఎస్ ధోని ఈ టోర్నమెంట్‌లో పునరాగమనం చేయబోతున్నాడనే వాస్తవం గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే, వీటన్నింటి మధ్య ధోనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడం అభిమానులందరినీ అయోమయానికి గురిచేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరచుగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. కానీ, ధోని మాత్రం ఈ విషయంలో చాలా వెనుకంజలో ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో, ధోని ఈసారి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి అలాంటి పోస్ట్ చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ పోస్ట్ తర్వాత, 2024 సీజన్‌లో ధోనిని కొత్త పాత్రలో చూస్తామా అని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

అయోమయంలో అభిమానులు..

కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ధోనీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. తాను రిటైర్ కాబోవడం లేదని, 2024 సీజన్ తన చివరి సీజన్ అని ధోనీ గత ఏడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ధోనీని రాబోయే సీజన్‌లో కోచ్ చూస్తామా అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో మరింత పెరిగింది. లేదా ధోనీ రిటైర్ అయ్యి కొత్త పాత్రలో కనిపించనున్నాడని అని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు.

ఇవి కూడా చదవండి

కొత్త ఆటగాళ్ల నుంచి మద్దతు..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. రాంచీకి చెందిన ఆటగాళ్లు సంయుక్తంగా అత్యధికంగా 5 టైటిళ్లను గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గతేడాది ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ CSK కొత్త సీజన్‌కు ముందు సూపర్ స్టార్లు బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, అంబటి రాయుడు, కైల్ జామీసన్‌లను విడుదల చేసింది. దీని తర్వాత వేలంలో రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు), అవినాష్‌ రావ్ (రూ. 20 లక్షలు) చెన్నై కొనుగోలు చేసింది.

జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలో CSK కెప్టెన్ ధోనీ చివరిసారిగా కనిపించాడు. అయితే, ఐపీఎల్ 2024 కోసం ధోని ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. CSK కెప్టెన్ తన చిన్ననాటి స్నేహితుడి స్పోర్ట్స్ కంపెనీని CSK నెట్స్‌లో ప్రమోట్ చేస్తూ కనిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..