AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం.. 48 బంతుల్లో 57 పరుగులు చేసిన కెప్టెన్..

టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్‎తో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లు మొదట్టి ఓవర్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు...

Ind Vs Pak: విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం.. 48 బంతుల్లో 57 పరుగులు చేసిన కెప్టెన్..
India
Srinivas Chekkilla
|

Updated on: Oct 24, 2021 | 9:45 PM

Share

టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్‎తో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లు మొదట్టి ఓవర్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఆటగాళ్లు పెవిలియన్‎కు క్యూ కట్టారు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‎ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

పాకిస్తాన్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్‎లోనే భారత్‎కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. షాహిన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 8 బంతులు ఆడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి ఊపుమీద ఉన్నట్లు కనిపించినా 11 పరుగులకే ఔటయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి హసన్ అలీ బౌలింగ్‏‎లో కాటన్ బౌల్డ్ అయ్యాడు.