AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: బీసీసీఐ ‘ప్లాన్ బీ’లో మిస్సయిన యూఏఈ.. ఐపీఎల్ 2022 నిర్వహించేది ఎక్కడంటే?

IPL Mega Auction: భారతదేశంలో కరోనాకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో బీసీసీఐ పలు క్రికెట్ ఈవెంట్‌లకు యూఏఈ మొదటి ఎంపికగా నిలుస్తోంది.

IPL 2022: బీసీసీఐ 'ప్లాన్ బీ'లో మిస్సయిన యూఏఈ.. ఐపీఎల్ 2022 నిర్వహించేది ఎక్కడంటే?
ipl
Venkata Chari
|

Updated on: Jan 13, 2022 | 2:45 PM

Share

BCCI’s Plan B for IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్ రాబోతోంది. కానీ, కరోనా (Covid -19) కూడా మరోసారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తన పరిధిని పెంచుకుంటోంది. దాని విధ్వంసానికి ప్రజలను బాధితులుగా మారుస్తోంది. మధ్యలో భారత్‌లో నిర్వహించిన లీగ్‌కి గత సీజన్‌లో కరోనా ఎలా బ్రేకులు వేసిందో తెలిసిందే. దీంతో మిగిలిన మ్యాచ్‌ల కోసం బీసీసీఐ యూఏఈకి వెళ్లాల్సి వచ్చింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఇప్పుడు ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ప్లాన్ బీపై పని చేస్తోంది.

భారతదేశం ఏప్రిల్ నాటికి కరోనా వేగాన్ని ఆపకపోతే, బీసీసీఐ ఈ రిచ్ లీగ్‌ను విదేశాల్లో నిర్విహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి మాత్రం యూఏఈలో నిర్వహించకూదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీసీఐ ప్లాన్‌ బీలో ముందుకొస్తున్న రెండు దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా కాగా, మరొకటి శ్రీలంక. 2009లో ఒకసారి బీసీసీఐ టీ20 లీగ్‌ని నిర్వహించిన అనుభవం దక్షిణాఫ్రికాకు ఉంది.

యూఏఈను లిస్టు నుంచి తొలగించిందా.. భారతదేశంలో కరోనాకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో బీసీసీఐ ఐపీఎల్ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించేందుకు మొదటి ఎంపికగా ఎంచుకునేది. అక్కడ ఇప్పటికే IPL 2021 రెండవ అర్ధభాగం నిర్వహించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2021 కూడా అక్కడే నిర్వహించారు. కానీ, ప్రస్తుతం బీసీసీఐ యూఏఈ వేదికను మార్చాలని ప్లాన్ చేస్తోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, “మేం అన్ని సమయాలలో యూఏఈపై మాత్రమే ఆధారపడలేం. మేం ఇతర ఎంపికలను కనుగొనవలసి ఉంటుంది. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సమయ వ్యత్యాసం ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు కూడా చాలా సరిపోతుంది.

దక్షిణాఫ్రికా సరైన ఎంపిక.. దక్షిణాఫ్రికా సమయం కంటే భారత్ 3 గంటల 30 నిమిషాలు ముందుంది. అంటే మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు దక్షిణాఫ్రికాలో ప్రారంభం చేస్తే, అది భారతదేశంలో రాత్రి 7:30లకు ప్రారభమవుతుంది. ఇది ప్రసార సమయాన్ని ప్రభావితం చేయదు. అక్కడ మ్యాచ్ కూడా సరైన సమయంలో ముగుస్తుంది. దీని కారణంగా ఆటగాళ్లకు కూడా విశ్రాంతి లభిస్తుంది.

IPL 2022 కోసం BCCI ప్లాన్ బీలో దక్షిణాఫ్రికా పేరు కూడా ముందంజలో ఉంది. ఎందుకంటే ఇటీవలి సిరీస్ అక్కడ విజయవంతంగా ముగిసింది. అది భారత్ ఏ జట్టు పర్యటన అయినా లేదా సీనియర్ జట్టు మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగింది. ఈ రెండు సిరీస్‌ల విజయంతో బీసీసీఐ యూఏఈ కాకుండా దక్షిణాఫ్రికా గురించి ఆలోచించాల్సి వచ్చింది.

టీమిండియా సౌతాఫ్రికా టూర్ ప్రారంభం కానున్న తరుణంలో, అక్కడ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా, సిరీస్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, సిరీస్ ప్రారంభమైనప్పుడు, Omicron ఆటపై ఎటువంటి ప్రభావం చూపలేదు. భారత్‌కు దక్షిణాఫ్రికా విజయవంతంగా ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం అక్కడ Omicron కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి.

Also Read: IND vs SA, 3rd Test, Day 3, LIVE Score: ఆట ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బలు.. పెవిలియన్ చేరిన పుజారా, రహానె..!

Pushpa: మళ్లీ పుష్పరాజ్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌.. ఈసారి ఏకంగా నోట్లో బీడీ పెట్టుకుని..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..