AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ఆసియా కప్‌లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కంపల్సరీ ? బీసీసీఐ చెప్పిన 4 కారణాలు ఇవే!

సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో, భారత జట్టు తన మొదటి మ్యాచ్ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతోంది. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని చాలామంది అభిమానులు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ లాంటి వారు కోరుకుంటున్నారు.

IND vs PAK : ఆసియా కప్‌లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కంపల్సరీ ? బీసీసీఐ చెప్పిన 4 కారణాలు ఇవే!
Ind Vs Pak
Rakesh
|

Updated on: Aug 21, 2025 | 9:15 AM

Share

IND vs PAK : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో భారత్ తమ రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌పై ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది. పుల్వామా దాడి తర్వాత ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని చాలామంది అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం దీనిపై వేరే రకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అధికారులు చెప్పినట్లుగా, ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని వారు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ రద్దయితే భారత క్రికెట్ బోర్డుకు కూడా నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఒక ప్రముఖ మీడియాకు ఈ సమాచారాన్ని అందించారు.

గతంలో పుల్వామా దాడి తర్వాత డబ్ల్యుసీఎల్‌లో ఇండియా లెజెండ్స్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది. టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం సరైందని భావించి, సెమీఫైనల్‌లో కూడా పాకిస్తాన్‌తో ఆడకూడదని నిర్ణయించుకుంది.

బీసీసీఐ అధికారులు చెప్పినట్లుగా, భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే వారికి ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. ఆ పాయింట్ల సహాయంతో పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోవచ్చు. పాకిస్తాన్‌కు ఉచితంగా పాయింట్లు ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు.

రెండో కారణం ఏమిటంటే, భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ విఫలమవుతుంది. దీనివల్ల ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది. ఇది ఏసియన్ క్రికెట్ కౌన్సిల్‌లో భారత్ ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది. పాకిస్తాన్ ఇతర దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా మార్చవచ్చు.

మూడో కారణం, ఐసీసీ రాజకీయాల్లో బీసీసీఐ బలహీనపడటం. ప్రస్తుతం ఏదైనా విషయంపై ఓటింగ్ జరిగితే, ఆసియాలోని చాలా దేశాలు బీసీసీఐకి మద్దతు ఇస్తున్నాయి. ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. ఐసీసీ టోర్నమెంట్‌ల ఆతిథ్యం కోసం భారత్, పాకిస్తాన్ కలిసి ఓటు వేస్తున్నాయి. భారత్ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే, ఐసీసీలో బీసీసీఐ స్థానం బలహీనపడవచ్చు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ప్రసారదారులకు పెద్ద నష్టం వాటిల్లుతుంది. బీసీసీఐ అధికారి చెప్పినట్లుగా.. 2024 నుంచి రాబోయే 4 ఆసియా కప్‌ల ప్రసార హక్కులను దాదాపు రూ. 1500 కోట్లకు విక్రయించారు. ఈ భారీ ధర రావడానికి ప్రధాన కారణం భారత్-పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోని ప్రకటనల స్లాట్లు 10 సెకండ్లకు రూ. 25-30 లక్షలకు అమ్ముడవుతాయి. ఇతర భారత మ్యాచ్‌లలో ఈ మొత్తం సగం మాత్రమే ఉంటుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే, ప్రసారదారులకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల ప్రసారదారుల దృష్టిలో బీసీసీఐ విశ్వసనీయత తగ్గుతుంది.

అయితే, ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. బీహార్ ఎన్నికల ప్రచారం ఆ సమయంలో వేగవంతం అవుతుంది. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను జరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరగవచ్చు. చివరి క్షణంలో భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే అవకాశం కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us