AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పీసీబీకి బిగ్ షాకిచ్చిన భారత్.. పాక్ పర్యటనకు వెళ్లబోమంటూ ఐసీసీకి లేఖ..

Champions Trophy 2025: భారత ప్రభుత్వ సూచనల మేరకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించడం ICCకి అత్యవసరం. ఈ నిర్ణయానికి పాకిస్థాన్ అంగీకరించకపోతే ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

Champions Trophy: పీసీబీకి బిగ్ షాకిచ్చిన భారత్.. పాక్ పర్యటనకు వెళ్లబోమంటూ ఐసీసీకి లేఖ..
Champions Trophy 2025
Venkata Chari
|

Updated on: Nov 09, 2024 | 9:51 PM

Share

Champions Trophy 2025: ఫిబ్రవరి 19, మార్చి 9, 2025 మధ్య ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపే విషయమై బీసీసీఐ ఇంకా ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం సమర్పించకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉండగా, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించే సమయం ఆసన్నమైనందున బీసీసీఐ తన వైఖరిని ఐసీసీకి సమర్పించాల్సి వచ్చింది. భారత ప్రభుత్వ సూచనల మేరకు బీసీసీఐ ఐసీసీకి తెలియజేసి భారత జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

తన నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేసిన బీసీసీఐ..

ESPNcricinfo నివేదిక ప్రకారం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపలేమని BCCI ICCకి తెలిపింది. దీనికి గల కారణాన్ని బీసీసీఐ తెలియజేస్తూ.. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపవద్దని భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు ఐసీసీకి తెలిపింది. అంటే ఇప్పుడు టీమ్ ఇండియా జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదు. అందువల్ల, హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం తప్ప పాకిస్తాన్‌కు వేరే మార్గం లేదు.

ఈ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ అంగీకరించకపోతే ఐసీసీతో పాటు పాకిస్థాన్ బోర్డు కూడా భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఐసీసీ ఏ ఈవెంట్ నిర్వహించినా ప్రధాన ఆదాయ వనరు టీమ్ ఇండియానే. అందువల్ల టీమ్ ఇండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే ధైర్యం ఐసీసీకి లేదు. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించడం అనివార్యం.

నిజానికి, భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా, 2008 ఆసియా కప్ నుంచి టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. ఈ సందర్భంలో, టీమిండియా ఈసారి పాకిస్తాన్‌కు వెళ్లదు. అయితే, 2023 ప్రపంచకప్‌తో సహా పలు ICC ఈవెంట్‌ల కోసం పాకిస్థాన్ భారత్‌ను సందర్శించింది.

హైబ్రిడ్ మోడల్‌లో టోర్నమెంట్..

ఒకవేళ టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే.. ఈ టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించే విషయమై చర్చలు జరిగినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే భారత్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకుముందు 2023లో ఆసియా కప్ కూడా హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పటికే ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌కు శ్రీలంకలో టీమిండియా మ్యాచ్‌లు ఆడడం తప్ప మరో మార్గం లేదు. టోర్నీ ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరిగింది.

పాకిస్థాన్ ఒత్తిడికి తలొగ్గిందా?

తాజాగా ఈ టోర్నీపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ కీలక ప్రకటన చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు రాదని వార్తలు వచ్చాయి. కానీ, మా స్థానం స్పష్టంగా ఉంది. ఏదైనా సమస్య ఉంటే బీసీసీఐ రాతపూర్వకంగా తెలియజేయాలి. ఇప్పటివరకు మనం హైబ్రిడ్ మోడల్ గురించి కూడా ఆలోచించలేదు. దానికి సిద్ధంగా లేదు. మేం ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాం. ఇది విజయవంతమవుతుందని మేం ఆశిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

భారత జట్టు ఇక్కడికి రాకపోతే మన ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దానిని పాటించాలి. భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే ఒత్తిడికి లొంగిపోతామని అనుకోవద్దని అన్నాడు. మరి ఈ ఇద్దరి పరువు ప్రతిష్టల పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..