IPL 2023: ఐపీఎల్ 2024లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం? బీసీబీ చర్యలతో బీసీసీఐ అసంతృప్తి.. కారణం ఏంటంటే?

Bangladesh: ఐపీఎల్ 2023లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు కొంత భాగం అందుబాటులో ఉండరు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ చర్యపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

IPL 2023: ఐపీఎల్ 2024లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం? బీసీబీ చర్యలతో బీసీసీఐ అసంతృప్తి.. కారణం ఏంటంటే?
Bangladesh
Follow us

|

Updated on: Mar 26, 2023 | 7:50 AM

ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని చర్యలు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు నచ్చడంలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు దేశాల ఆటగాళ్లను IPL 2024లో నిషేధించవచ్చని తెలుస్తోంది. వచ్చే సీజన్‌లో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సిరీస్‌లను ఐపీఎల్ సమయంలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా IPL జట్టులో భాగమైన చాలా మంది ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు ఫ్రాంచైజీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఐపీఎల్‌కు దూరమయ్యే ప్లేయర్లు..

ఐపీఎల్ 2023లో షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లతో సహా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటారు. ముగ్గురు ఆటగాళ్లు తమ సంబంధిత IPL జట్లకు ఏప్రిల్ 9 నుంచి మే 5 వరకు, మళ్లీ మే 15 నుంచి అందుబాటులో ఉంటారు. ఇది కాకుండా నలుగురు శ్రీలంక ఆటగాళ్లలో ముగ్గురు ఏప్రిల్ 8 తర్వాత మాత్రమే IPLకి అందుబాటులో ఉంటారు. ఇందులో వాణిందు హసరంగ, మతిషా పతిరన, మహేష్ తీక్షణ ఉన్నారు. ఏప్రిల్ 8 వరకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనలో ఉండనుంది.

భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై అభిప్రాయం మారుతుందా..

ఒక ఫ్రాంచైజీ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, “ఇతర బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నందున మేం ఫిర్యాదు చేయలేం. ఫ్రాంచైజీలు కొన్ని దేశాల నుంచి ఆటగాళ్లను ఎంచుకోవడానికి వెనుకాడుతుంది. తస్కిన్ అహ్మద్ NOC పొందలేదు. ఇప్పుడు ఇలాంటి వార్త వచ్చింది. వారు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించకూడదంటే, వారు నమోదు చేసుకోకూడదు. సహజంగానే బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆలోచన భవిష్యత్తులో మారుతుంది’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పాపోన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, “ఈ సమస్య గురించి నన్ను పదే పదే అడిగారు. నేను అదే సమాధానం ఇచ్చాను. ఐపీఎల్ వేలానికి పిలిచే ముందు, ఐపీఎల్ అధికారులు ఆటగాళ్ల లభ్యత గురించి మమ్మల్ని అడిగారు. మేం వారికి షెడ్యూల్ ఇచ్చాం. ఈ విషయం తెలుసుకున్న ఆయన వేలానికి ముందుకొచ్చారు. అతను బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు కాస్త డౌట్ వస్తుందేమో ఆలోచించుకోమని చెప్పాం. మేం దానిని క్లియర్ చేశాం. నిజం చెప్పాలంటే, మనసు మార్చుకునే అవకాశం నాకు కనిపించడం లేదు” అని తెలిపాడు.

అంతా ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుంది..

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌తో బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ, “తమ బోర్డుని ఒప్పించడం ఆటగాళ్లపైనే ఉంటుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇతర ప్రధాన బోర్డులు దీని కోసం మార్గాలను రూపొందించాయి. ఐపీఎల్ ప్రజాదరణను ఎవరూ కాదనలేరు. ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా బోర్డు కూడా వారి వాటాను పొందుతుంది. కానీ, వారు వేరే నిర్ణయం తీసుకుంటే, అది వారిపై ఉంటుంది’ అంటూ చెపుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..