AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: పాకిస్థాన్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్‌ మాస్టర్ స్కెచ్‌తో దిమ్మతిరిగిపోయిందిగా..

ప్రస్తుతం ఆసియా కప్ 2025 భవిష్యత్తుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వి (పీసీబీ చీఫ్) వేదిక మార్పును అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి క్రికెట్ కంటే కూడా భౌగోళిక రాజకీయ అంశంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు

Asia Cup 2025: పాకిస్థాన్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్‌ మాస్టర్ స్కెచ్‌తో దిమ్మతిరిగిపోయిందిగా..
Asia Cup 2025
Venkata Chari
|

Updated on: Jul 22, 2025 | 6:55 PM

Share

Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణకు సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చేదు వార్త ఎదురైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మార్చాలన్న భారత్ డిమాండ్‌కు శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామం రాబోయే ఆసియా కప్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

వివాదానికి కారణం ఏమిటి?

ఏసీసీ AGM సమావేశం జులై 24-25 తేదీల్లో ఢాకాలో జరగాల్సి ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ (BCCI) వేదిక మార్పును కోరింది. ఢాకాలో రాజకీయ అనిశ్చితి కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఏసీసీ నిబంధనల ప్రకారం, సమావేశం జరగాలంటే కనీసం ముగ్గురు శాశ్వత సభ్యులు (టెస్ట్ ఆడే దేశాలు), పది మంది పూర్తి లేదా అసోసియేట్ సభ్యులు హాజరుకావాలి. ఇప్పుడు శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు మద్దతు ఇవ్వడంతో పాకిస్థాన్‌కు పరిస్థితి క్లిష్టంగా మారింది.

పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ..

ఆసియా కప్ 2023లో భారత్ పాకిస్థాన్‌కు వెళ్లడానికి నిరాకరించినప్పుడు, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించారు. అంటే భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడగా, మిగిలిన మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగాయి. అంతకుముందు కూడా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి.

ఈ తాజా పరిణామం పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. బీసీసీఐ ఆసియా కప్‌ను బహిష్కరిస్తే, పాకిస్థాన్, ఇతర దేశాలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఐసీసీకి వచ్చే ఆదాయంలో సింహభాగాన్ని బీసీసీఐయే అందిస్తుంది.

భవిష్యత్తుపై సందిగ్ధత..

ప్రస్తుతం ఆసియా కప్ 2025 భవిష్యత్తుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వి (పీసీబీ చీఫ్) వేదిక మార్పును అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి క్రికెట్ కంటే కూడా భౌగోళిక రాజకీయ అంశంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, ఆసియా కప్ 2025 జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..