AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Ayush Mhatre : నిన్న జరిగిన మ్యాచులో రిటైర్డ్ అవుట్‌పై సిఎస్‌కె బ్యాటర్ ఆయుష్ మాత్రే నోరు విప్పారు. జట్టు గెలుపు కోసమే వెనక్కి వచ్చానని స్పష్టం చేశారు. సంజు సెంచరీతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్ర్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఫస్ట్ విక్టరీని అందుకుంది.

Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్
Ayush Mhatre
Rakesh
|

Updated on: Apr 12, 2026 | 9:27 AM

Share

Ayush Mhatre : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్‎గా వెనుదిరగడం పెను సంచలనంగా మారింది. ఆడుతున్నది 59 పరుగులతో హాఫ్ సెంచరీ దాటేసిన బ్యాటర్.. కానీ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని వెనక్కి పిలిపించి శివమ్ దూబేను పంపింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో, స్వయంగా ఆయుష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ 17.3 ఓవర్ల వద్ద ఆసక్తికర మలుపు తిరిగింది. అప్పటికే ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 59 పరుగులు చేసి మంచి ఊపులో ఉన్నాడు. కానీ సడన్‌గా సిఎస్‌కె మేనేజ్‌మెంట్ అతన్ని రిటైర్డ్ అవుట్‎గా ప్రకటించి డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిపించింది. సాధారణంగా బ్యాటర్ గాయపడితే రిటైర్డ్ హర్ట్ అవుతారు, కానీ వ్యూహాత్మకంగా వికెట్ త్యాగం చేసి వెనుదిరగడాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు. ఆయుష్ స్థానంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే 10 బంతుల్లోనే 20 పరుగులు చేసి స్కోరును 212కు చేర్చాడు.

ఆయుష్ మాత్రే ఏమన్నాడు?

ఈ సంఘటనపై స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఆయుష్ చాలా పరిణతితో సమాధానం ఇచ్చాడు. “అక్కడ పెద్ద విషయం ఏమీ లేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో జట్టుకు మరిన్ని భారీ షాట్లు అవసరమయ్యాయి. శివమ్ దూబే నాకంటే బాగా క్లీన్ హిట్టింగ్ చేయగలడు. నేను కొన్ని బంతులను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాను, అందుకే సమయం వృథా కాకూడదని టీమ్ మేనేజ్మెంట్ ఈ ప్లాన్ చేసింది. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం, ఆటలో ఇలాంటివి సహజం” అని ఆయుష్ వివరించాడు. తన వ్యక్తిగత స్కోరు కంటే టీమ్ గెలుపుకే ప్రాధాన్యత ఇచ్చానని అతను స్పష్టం చేశాడు.

వ్యూహం ఫలించింది – గెలుపు దక్కింది

చెన్నై మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని ఫలితం నిరూపించింది. ఇన్నింగ్స్ 16, 17 ఓవర్లలో వరుసగా ముఖేష్ కుమార్, లుంగీ ఎన్గిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్ రేట్ తగ్గింది. డెత్ ఓవర్లలో స్కోరు వేగం పెంచేందుకే హిట్టర్ అయిన శివమ్ దూబేను పంపాలని కెప్టెన్ రుతురాజ్, కోచ్ భావించారు. దూబే మెరుపులు మెరిపించడంతో చెన్నై 212 పరుగులు చేయగలిగింది. చివరకు ఢిల్లీని 189 పరుగులకే కట్టడి చేసి 23 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. సంజు శామ్సన్ 115 పరుగులతో హీరోగా నిలిచినప్పటికీ, ఆయుష్ చేసిన ఈ చిన్న త్యాగం జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us