AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో దళారి అరెస్ట్.. సిఫార్స్ లేఖలతో టికెట్లు పొంది అధిక ధరకు అమ్ముతున్నట్లు గుర్తింపు

దళారుల చేతిలో తాము మోస పోయామని తరచుగా భక్తులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. తాజాగా స్పెషల్ దర్శనం టికెట్లను అధిక ధరకు అమ్ముతున్న ఓ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

Tirumala: తిరుమలలో దళారి అరెస్ట్.. సిఫార్స్ లేఖలతో టికెట్లు పొంది అధిక ధరకు అమ్ముతున్నట్లు గుర్తింపు
Tirumala Tirupati Devasthanam
Surya Kala
|

Updated on: Oct 30, 2022 | 2:48 PM

Share

తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనేక మంది భక్తులు కోరుకుంటారు. భక్తుల కోరికను ఆసరాగా చేసుకుని తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. భక్తుల దగ్గర నుంచి టికెట్స్, లడ్డులు, గదులు ఇలా రకరకాల సౌకర్యాల పేరు చెప్పి  అందినకాడికి దోచుకుంటున్నారు. దళారుల చేతిలో తాము మోస పోయామని తరచుగా భక్తులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. తాజాగా స్పెషల్ దర్శనం టికెట్లను అధిక ధరకు అమ్ముతున్న ఓ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

తిరుమలలో దళారీని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి స్వామివారి స్పెషల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 రూ.300 దర్శన టికెట్లను..  రూ.32 వేలుకు విక్రయించాడు. దళారీ కరుణ కుమార్ గా .. కాణిపాకం ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. కరుణ కుమార్ మోసంపై టీటీడీ విజిలెన్స్ కు కర్ణాటకకు చెందిన నవీన్ కేశవమూర్తి అనే భక్తుడు ఫిర్యాదు చేశాడు.

దళారి కరుణ కుమార్.. ఈ స్పెషల్ టికెట్లను కాణిపాకం ఆలయ ఏఈఓ మాధవరెడ్డి సిఫార్సు లేఖతో టికెట్లు పొందినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తాను తన కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్లాలని చెప్పి.. కాణిపాకం ఏఈఓ వద్ద సిఫార్సు లేఖ తీసుకున్నాడు. ఈ  ఏఈఓ సిఫార్సు లేఖతో టికెట్లు పొంది భక్తులకు కరుణ కుమార్ అధిక ధరకు విక్రయించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తిరుమలలో దళారుల బెడద పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే స్వామివారి దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దళారుల వలలో పడి మోసపోకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి