AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా మారిన వాతావరణం.. మంచు దుప్పటి కప్పేసిన కేదార్‌నాథ్‌.. చిక్కుకుపోయిన యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు

దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఒక్కసారిగా మారిన వాతావరణం.. మంచు దుప్పటి కప్పేసిన కేదార్‌నాథ్‌.. చిక్కుకుపోయిన యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు
Balaraju Goud
|

Updated on: Nov 16, 2020 | 3:05 PM

Share

దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌‌లు అక్కడ చిక్కుకుపోయారు.

హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని శీతాకాలం సందర్భంగా సోమవారం నుంచి మూసివేయనున్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు త్రివేంద్ర సింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్ లు ఆదివారం అర్దరాత్రి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా భక్తుల కోసం 40 గదుల పర్యాటక అతిథిగృహానికి శంకుస్థాపన చేయడానికి ఇరువురూ ఆదివారం వెళ్లారు. కేదార్‌నాథ్‌లో విపరీతంగా మంచు కురువడంతో ఆ ప్రాంతం మంచు పేరుకుపోయింది. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆలయాన్ని మూసివేశారు.

శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగానే ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడి నుంచి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు హెలికాప్టర్ సేవలను కొనసాగించే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు.

కాగా, ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల వల్ల ఆ ప్రాంతమంతా విపరీతమై మంచు దుప్పటి కప్పేసింది. పరిస్థితి కుదుటపడిన తర్వాత ఇరువురూ బదరీనాథ్ చేరుకుంటారు. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో కేదార్‌నాథ్‌ను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్.. టూరిజం గెస్ట్‌హౌస్ కట్టిస్తామని ప్రకటించారు.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..