Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి టీటీడీ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో ఆదాయం

కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భక్తులు బారులు తీరారు

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి టీటీడీ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో ఆదాయం
Tirumala Devotees Rush
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2022 | 2:24 PM

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయుడైన తిరుమల శ్రీనివాసుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. తెలుగు రాష్ట్రాల(Telugu States) నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తుంటారు. ఆ వేంకటనాథుని దర్శనం చేసుకుని తమ శక్తి కొలది.. శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భక్తులు బారులు తీరారు. దీంతో ఈ క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చి చేరింది. కేవలం ఒక్క మే నెలలో రికార్డు స్థౄయిలో 130 కోట్లు ఆదాయం శ్రీవారికి హుండీకి చేరింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కేవలం ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు ఈవో.

‘‘మే నెలలో స్వామివారిని 22 లక్షల 62 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా టైమ్‌ స్లాట్‌ సర్వదర్శన విధానం పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, టైమ్‌ స్లాట్‌ టోకెన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.