AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Bhog: యాదాద్రి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. బోగ్ సర్టిఫికెట్ అందజేత

ఆలయాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రతి యేట జాతీయ సర్టిఫికెట్‌ ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయాన్ని ప్రత్యేక ఆడిట్ బృందం కొన్ని రోజుల కిందట సందర్శించింది. ఆలయంలో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Yadadri Bhog: యాదాద్రి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. బోగ్ సర్టిఫికెట్ అందజేత
Yadadri Bhog
M Revan Reddy
| Edited By: Surya Kala|

Updated on: Jan 14, 2024 | 9:39 AM

Share

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొదిద్దుకున్న యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. స్వామి వారి ప్రసాదానికి భోగ్‌ సర్టిఫికెట్‌ లభించింది. నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంట గది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచీ శుభ్రత వంటి అంశాలు పరిశీలించి మెరుగ్గా ఉన్న ఆలయాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రతి యేట జాతీయ సర్టిఫికెట్‌ ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది.

ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయాన్ని ప్రత్యేక ఆడిట్ బృందం కొన్ని రోజుల కిందట సందర్శించింది. ఆలయంలో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోగ్ సర్టిఫికెట్ కోసం దేశంలోని 70 దేవాలయాలు దరఖాస్తు చేసుకోగా, తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి, వర్గల్ విద్యా సరస్వతి ఆలయాలకు బోగ్ సర్టిఫికెట్ దక్కింది. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల వర్ధన్‌రావు శనివారం ఆలయ అధికారులకు భోగ్ సర్టిఫికెట్ ను అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..