Mystery Temple: ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు ..

చాలా మంది ఈ సంఘటనను ఒక అద్భుతంగా భావిస్తారు. ఇది కాళీకా దేవి దైవిక శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఘటన వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని కొందరి అభిప్రాయం. విగ్రహం తయారు చేసిన రాయిలోని పదార్థం.. ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరిగుతుందని కొందరు నమ్ముతారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు. అయినా ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

Mystery Temple: ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు ..
Mystery Temple
Follow us

|

Updated on: Oct 12, 2024 | 9:32 AM

దేశవ్యాప్తంగా అనేక పురాతన దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైనవి. ఈ పురాతన ఆలయాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే కొన్ని ఆలయాలు అనేక రహస్యాలు నెలవు. అలాంటి మిస్టరీ ఆలయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉంది. ఇక్కడ కాళికాదేవి ఆలయం వెరీ వెరీ స్పెషల్.  ఈ ఆలయంలో ఏసీ ఆగితే చాలు  అమ్మవారి దేహానికి చెమటలు పడతాయని చెబుతున్నారు .

చాలా మంది ఈ సంఘటనను ఒక అద్భుతంగా భావిస్తారు. ఇది కాళీకా దేవి దైవిక శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఘటన వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని కొందరి అభిప్రాయం. విగ్రహం తయారు చేసిన రాయిలోని పదార్థం.. ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరిగుతుందని కొందరు నమ్ముతారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు. అయినా ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కాళీమాత దివ్యశక్తికి ఈ సంఘటన నిదర్శనంగా స్థానికులు భావిస్తారు.

చెమటలు పట్టే కాళీ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారు. ప్రజలు తమ కోరికలను తీర్చమని కోరుకుంటూ కాళికాదేవి నుంచి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయంలో ఏడాది పొడవునా వివిధ మతపరమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఏసీ స్విచ్ ఆఫ్ చేయగానే తల్లికి చెమటలు పట్టాయి

చలికాలంలో అంతా బాగానే ఉంటుందని స్థానికుల నమ్మకం. అయితే వేసవి కాలం రాగానే కాళీ విగ్రహానికి చెమటలు పడతాయి. ఆలయ పూజారి అమ్మవారి బట్టలు మార్చే సమయంలో అమ్మవారి బట్టలు తడిసి దర్శనమిస్తాయి .  అప్పటి నుంచి భక్తులు కాళికాదేవి ఆలయంలో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. వేసవి కాలం వచ్చినప్పుడల్లా ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ 24 గంటలు నడుస్తుంది. ఏదైనా కారణంతో ఏసీ ఆగిపోతే వెంటనే అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు పడతాయని ప్రజల నమ్మకం. ఈ దేవాలయం 500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఆలయాన్ని . . అమ్మవారిని దేశవ్యాప్తంగా ‘AC వలీ కాళి దేవి’ అని పిలుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు
ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు
ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా..
ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా..
పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
ప్రమాదంలో విమానం.. 2 గంటలకుపైగా గాల్లో చక్కర్లు! వీడియో
ప్రమాదంలో విమానం.. 2 గంటలకుపైగా గాల్లో చక్కర్లు! వీడియో
దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడికి ప్రత్యేక పూజలు.. 
దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడికి ప్రత్యేక పూజలు.. 
నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం