AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు నెలల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం.. చార్‌ధామ్ ఆలయాల తలుపులు తెరుచుకునే తేదీలు ఖరారు – పూర్తి వివరాలు ఇక్కడే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త.. కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకునే శుభ సమయం వచ్చేసింది. చార్ ధామ్ యాత్రల్లో ముఖ్యమైన నాలుగు ఆలయాల ద్వారాలు ఏప్రిల్ నెలలో తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు కేదార్ నాథ్ - బద్రీనాథ్ ఆలయాల కమిటీ అధికారికంగా తేదీలను ప్రకటించాయి. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావల్పిండి ప్రభుత్వం కేదార్‌నాథ్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించింది.

ఆరు నెలల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం.. చార్‌ధామ్ ఆలయాల తలుపులు తెరుచుకునే తేదీలు ఖరారు – పూర్తి వివరాలు ఇక్కడే
Kedarnath Temple Opening
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2026 | 7:46 AM

Share

పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నది ఉత్తరాఖండ్ లోని మహా క్షేత్రం కేదార్ నాథ్. శీతాకాలంలో దట్టమైన మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయాన్ని అక్టోబర్ – నవంబర్ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితిని బట్టి మూసివేస్తారు. తిరిగి ఆరునెలల తర్వాత.. అంటే ఏప్రిల్ నెలలో ఆలయం తెరచుకుంటుంది. మహా శివరాత్రి సందర్భంగా కేదార్ నాథ్.. బద్రీనాథ్ క్షేత్రాలకు సంబంధించి ఆలయ కమిటీలు ఆలయాలను తెరిచే తేదీలను నిర్ణయించి ప్రకటించారు. ఏప్రిల్ 22న కేదార్ నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే గంగోత్రి యమునోత్రి ఆలయాలు 19 నుండి తెరుచుకుంటాయని ఆలయ కమిటీల ప్రతినిధులు తెలిపారు.

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈ సంవత్సరం ఏప్రిల్ 22న వృషభ రాశి సమయంలో ఉదయం 8 గంటలకు భక్తుల కోసం తెరవబడతాయని కమిటీ తెలిపింది. తేదీ నిర్ధారించబడిన వెంటనే, అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించారు. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు భక్తులు జ్యోతిర్లింగాన్ని సందర్శించవచ్చు. రికార్డు సంఖ్యలో వచ్చే యాత్రికులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేలా ఫుట్‌పాత్‌లు, వసతి, వైద్య సౌకర్యాల మరమ్మతుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

సుమారు తొమ్మిదిన్నర క్వింటాళ్ల పూలతో అలంకరించబడిన ఓంకారేశ్వర్ ఆలయంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి రావల్ భీమశంకర్ లింగ్, కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆశా నౌటియాల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది, ఇతర అధికారులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us