Srisailam: భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల మల్లన్న క్షేత్రం.. ముక్కంటిశుని దర్శనానికి ఐదు గంటల సమయం

కార్తీక మాసంలోని సోమవారం భోళాశంకరుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ మాసం దానధర్మాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు కార్తీకమాసం తొలి సోమవారం.

Srisailam: భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల మల్లన్న క్షేత్రం.. ముక్కంటిశుని దర్శనానికి ఐదు గంటల సమయం
huge devotees rush at srisailam mallanna temple
Follow us

|

Updated on: Oct 31, 2022 | 11:35 AM

మాసాల్లోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని ప్రసిద్ధి. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు. మహిమాన్వితమైన కార్తీక మాసం శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దేశం నలుమూలలా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. శివయ్యకు రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలోని సోమవారం భోళాశంకరుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ మాసం దానధర్మాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు కార్తీకమాసం తొలి సోమవారం. దీంతో తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాల వద్ద బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..