AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి.. ఈరోజు ఆ ఒక్కటీ చేస్తే అదృష్టం, రాజయోగం మీదే!

Bhishma Ekadashi rituals: భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి ఈ రోజున అంటే జనవరి 29న బుధవారం నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. బీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంతో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులవుతారు.

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి.. ఈరోజు ఆ ఒక్కటీ చేస్తే అదృష్టం, రాజయోగం మీదే!
Bhishma Ekadashi
Rajashekher G
|

Updated on: Jan 29, 2026 | 9:56 AM

Share

హిందూ మతంలో భీష్మ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూచించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాధి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజు మహా విష్ణువును ప్రత్యేకంగా పూచించడంతోపాటు భీష్ముని స్మరించుకుంటారు. భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి ఈ రోజున అంటే జనవరి 29న బుధవారం నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. మహా భారతంలో భీష్మ పితామహుడు గురించి చాలా మందికి తెలుసు. ఆయనకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అది ఆయన కోరుకున్నప్పుడే ఆయనకు మరణం సంభవిస్తుంది.

అంతేగాక, భీష్మ పితామహుడు విష్ణు సహస్ర నామాలను, రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను తెలియజేశారు. తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్నాడు. బీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంతో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులవుతారు. మహాభారతంలో మహావీరుడు భీష్ముడు ఈ ఏకాదశి రోజునే శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ప్రాణత్యాగం చేసినట్లు విశ్వాసం. అందుకే ఈ రోజును భీష్ముని పేరుతో భీష్మ ఏకాదశిగా పిలుస్తారు.

ఈ ఒక్కటి చేస్తే చాలు.. అదృష్టం, రాజయోగం

విష్ణు సహస్రనామ పారాయణంతో కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ప్రతికూలతలు తొలిగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు విష్ణు నామ పారాయణంతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టంతోపాటు రాజయోగం కలుగుతుంది. విష్ణు పారాయణంతో మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమవుతుంది. మానసిక, శరీరక సమస్యలు తగ్గి సుఖజీవనం ప్రాప్తిస్తుంది.

విష్ణు పారాయణంతో భీష్మ ఏకాదశి రోజునే కాకుండా నిత్యం పారాయణ చేసే వారికి రక్షణ కవచంగా సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోయి వాక్షుద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది.

భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం చాలంటున్నారు పండితులు. ఉపవాసం చేయలేని వారు మనసుతో ఉపవాస భావనతో ఈ జపం చేస్తే కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి.

భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత

శాస్త్రాల ప్రకారం, ఈ ఏకాదశి నాడు చేసే వ్రతం వెయ్యి ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ముఖ్యంగా పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజు అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడింది. పితృదోషాలు, కర్మబంధనాలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఏకాదశి వ్రత విధానం

జయ ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి, తల స్నానం చేయాలి. లక్ష్మీనారాయణలను ప్రార్థించాలి. ఇల్లంతా గంగా జలం లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయాలి. సూర్యనారాయణుడుకి అర్ఘ్యం సమర్పించి, పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలను లేదా ఫొటోలను ప్రతిష్టించాలి. శ్రీ మహా విష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. పసుపు రంగు పండ్లు, పువ్వులు, పాయసం, తెలుపు స్వీ్ట్లను దానం చేయండి. విష్ణువుకు సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు, స్లోకాలు పఠించాలి. ఆ తర్వాత మంగళ హారతి ఇచ్చి.. సిరిసంపదల కోసం లక్ష్మీనారాయణులను ప్రార్థించాలి. రాత్రిపూట భజన కీర్తనలతో జాగరణ చేయడం మంచిది. మరుసటి రోజు ద్వాదశినాడు ఉదయం పూజ ముగించుకుని, బ్రాహ్మణులకు లేదా పేదలకు దానధర్మాలు చేసి భోజనం చేయాలి.

జయ ఏకాదశి వ్రతం ఫలితాలు..

జయ ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. అకాల మృత్యుభయం తొలగిపోతుంది. అంతేగాక, మరణాంతరం మోక్షం ప్రాప్తిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సిరిసంపదలు కలుగుతాయి. జయ ఏకాదశి వ్రతంతో పితృదేవతలకు శాంతి లభిస్తుంది. దీంతో వారి ఆశీస్సులు అందుకుంటారు.

తులసి కోట దగ్గర దీపారాధన చేయడంతోపాటు విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి తాండవం చేస్తుందని, వారి ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీంతో వారి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని, సిరిసంపదలు వస్తాయని చెబుతున్నారు. ఏకాదశి వ్రతం చేయడం వల్ల బ్రహ్మ హత్యా పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే జయ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వల్ల వారి ఇంటికి సిరిసంపదలు వెతుక్కుంటూ వస్తాయని విశ్వసిస్తారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)