Amarnath Yatra 2025: అమరనాథ్ గుహలో అమరత్వం పొందిన జంట పావురాల గురించి తెలుసా..! వీటి దర్శనం అదృష్టవంతులకే లభిస్తుందట..

హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్ర అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు. ఎందుకంటే అమర్‌నాథ్ గుహలోనే సృష్టికి లయకారుడైన శివుడు తల్లి పార్వతి దేవికి మోక్ష మార్గాన్ని చూపించాడని విశ్వాసం. అయితే పూర్వ కాలంలో అమర్‌నాథ్ గుహను అమరేశ్వర్ అనే పేరుతో పిలిచేవారు. అయితే ఈ గుహలో ఒక జత పావులు కనిపిస్తాయి. ఆ జంట రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

Amarnath Yatra 2025: అమరనాథ్ గుహలో అమరత్వం పొందిన జంట పావురాల గురించి తెలుసా..! వీటి దర్శనం అదృష్టవంతులకే లభిస్తుందట..
Amarnath Yatra 2025

Updated on: Jul 03, 2025 | 12:26 PM

అమర్‌నాథ్ క్షేత్రం పరమ శివుడి పవిత్ర క్షేత్రం. మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు చేసే యాత్రను పవిత్ర తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఇక్కడ వెలసిన శివయ్యను సందర్శించడం వల్ల అనేక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. 2025 సంవత్సరంలో అమర్‌నాథ్ యాత్ర జూలై 3 గురువారం నుంచి మొదలైంది. మొదటి బ్యాచ్ ఈ రోజున బయలుదేరింది. అమర్‌నాథ్ గుహ ఆలయం హిందూ మతంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశంలో శివుడు..స్వయంగా పార్వతికి అమరత్వానికి సంబంధించిన రహస్యాన్ని చెప్పాడని నమ్ముతారు. అందుకనే అమర్‌నాథ్ గుహలో శివలింగాన్ని దర్శించుకున్న వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు జరుగుతుంది?

ప్రతి సంవత్సరం ఈ పవిత్ర గుహలో ఒక మంచు రూపంలో సహజ శివలింగం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. మంచుతో ఏర్పడిన ఈ శివలింగాన్ని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ ప్రయాణం జూలై మొదటి వారం లేదా ఆషాఢ పూర్ణిమ నుంచి ప్రారంభమై శ్రావణ మాసం అంతా కొనసాగి రాఖీ పండగ రోజున ముగుస్తుంది. శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున శివలింగం దాని పూర్తి పరిమాణాన్ని పొందుతుందని నమ్ముతారు.

పావురాల జంట రహస్యం

ఈ గుహలోనే శివుడు తన భార్య పార్వతికి అమరత్వం పొందిన కథను వివరించాడు. అమర్‌నాథ్ దాని మార్గంలోని అనేక ప్రదేశాలకు ప్రయాణాన్ని కూడా వివరిస్తున్న సమయంలో చెప్పిన ఈ కథను అమర్ కథ అని పిలుస్తారు. ఇలా కథని చెప్పే సమయంలో ఒక జంట పావురాలు అక్కడ ఉన్నాయట. ఆ పావురాల జతకు మరణం అనేది లేకుండా పోయింది. అందుకనే వాటిని అమర పక్షులుగా భావిస్తారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఈ పావురాలు కనిపించేవట. ఆ జంట పక్షులను చూసిన భక్తులు అది తమ అదృష్టవంతులుగా భావిస్తారు. అంతేకాదు ఈ జంటను చూసే భక్తులు శివపార్వతుల ఒకే దర్శనాన్ని పొందుతారని నమ్ముతారు. వాటిని చూసే వారికి శివయ్య మోక్షాన్ని ఇస్తాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.