Amarnath Yatra Ends: ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజుల్లో 5 లక్షలకు పైగా శివయ్యను దర్శించుకున్న భక్తులు

మహంత్ స్వామి దీపేంద్ర గిరి తీసుకుని వెళ్ళిన చారీ ముబారక్ ఆగస్ట్ 14న శ్రీనగర్‌లోని దశనమి అఖారా ఆలయం నుంచి యాత్ర ప్రారంభించగా... ఆగస్ట్ 16న పహల్గామ్ నుంచి పుణ్యక్షేత్రం వైపు అంతిమ యాత్ర ప్రారంభమైంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది యాత్ర సాగింది. 52 రోజుల తర్వాత శ్రావణ పూర్ణిమ రోజున పూర్తియింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగే ఈ యాత్రలో ఈ ఏడాది 5.1 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారని ఓ అధికారి తెలిపారు.

Amarnath Yatra Ends: ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజుల్లో 5 లక్షలకు పైగా శివయ్యను దర్శించుకున్న భక్తులు
Amarnath Yatra Ends
Follow us

|

Updated on: Aug 20, 2024 | 7:18 AM

సృష్టి లయకారుడైన శివుడు లింగాకృతిలో పూజలు అందుకునే ఆలయాలు అనేకం యున్నాయి. అవును పరమశివుడు హిమాలయాల్లో అనేక చోట్ల కొలువై ఉన్నాడు. కానీ.. మంచుతో సహజసిద్ధంగా శివలింగంగా భక్తులకు దర్శనం ఇచ్చేది మాత్రం ఒకే ఒక్క చోట. అదే.. జమ్ము-కాశ్మీర్‌లోని హిమశిఖరాల మధ్య.. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గుహ. ఏడాది మొత్తంలో కొన్ని రోజుల పాటు మాత్రమే దర్శనిమిచ్చే ఈ శివయ్యను దర్శించుకోవడం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే.. అంత ఎత్తున, అత్యంత ప్రమాదభరితమైన హిమశిఖరాలు, లోయల మీదుగా అమర్నాథ్‌ గుహకు చేరుకోవడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. అందుకే.. ఈ యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేసి ఫిట్‌నెస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. దానిలో భాగంగా.. జూన్ 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర మంగళవారం శివునిది అని నమ్ముతున్న వెండి గద్దె, రక్షా బంధన్ పండుగతో పాటు శ్రావణ పూర్ణిమ సందర్భంగా ప్రార్థనలు జరిగే గుహ మందిరానికి చేరుకోవడంతో ఈ యాత్ర ముగిసింది.

మహంత్ స్వామి దీపేంద్ర గిరి తీసుకుని వెళ్ళిన చారీ ముబారక్ ఆగస్ట్ 14న శ్రీనగర్‌లోని దశనమి అఖారా ఆలయం నుంచి యాత్ర ప్రారంభించగా… ఆగస్ట్ 16న పహల్గామ్ నుంచి పుణ్యక్షేత్రం వైపు అంతిమ యాత్ర ప్రారంభమైంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది యాత్ర సాగింది. 52 రోజుల తర్వాత శ్రావణ పూర్ణిమ రోజున పూర్తియింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగే ఈ యాత్రలో ఈ ఏడాది 5.1 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారని ఓ అధికారి తెలిపారు.

ప్రతియేటా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే ఈ అమర్ నాథ్ యాత్ర జూన్ 29 న అధిక భద్రత మధ్య ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని తెలిపాయి. ఈ గుహ మందిరం దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాలలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న  యాత్రను పూర్తి చేయడానికి వేసవి నెలల్లో లక్షలాది మంది యాత్రికులు మంచుతో కప్పబడిన హిమానీనదాలు, మంచు, చల్లటి నీటిని దాటుకుంటూ శివుడిని దర్శించుకోవడానికి వెళతారు. ఇదిలావుంటే.. అమర్‌నాథ్ గుహకు చేరుకోడానికి రెండు మార్గాలుండగా.. ఒకటి పహల్‌గాం నుంచి.. మరోటి బాల్‌తాల్ నుంచి ప్రారంభం అవుతాయి.

యాత్రికులు సాధారణంగా దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ బేస్ క్యాంప్ నుండి పర్వత మార్గాలకు 36 కి.మీ ట్రెక్కింగ్ చేస్తారు, అయితే మధ్య కాశ్మీర్‌లోని బాల్తాల్ వైపు నుండి, ఈ మార్గం తక్కువగా ఉంటుంది, అయితే యాత్రికులు కేవలం 14 కి.మీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో.. యాత్రికులు తమ శక్తిసామర్థ్యాలను, ఆరోగ్యాన్ని బట్టి తమకు నచ్చిన మార్గంలో యాత్ర చేస్తుంటారు. ఈ సారి అమర్నాథ్‌ యాత్రకు ఇద్దరు సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్స్‌గా కేంద్రం నియమించింది. సదుపాయాలతో పాటు యాత్రికుల భద్రత కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏర్పాట్లు చేశారు. ప్రమాదకరమైన ట్రాక్‌ల వెంట అధికారులు ఆరోగ్య సేవలను కూడా అందించారు. సుమారు 3,807 మంది రోగులు గాయాలకు చికిత్స పొందారు. 26,918 మంది రోగులు వివిధ రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు” అని ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు. అలాగే.. యాత్రికులకు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించేందుకు అడుగడుగునా సాయుధ పారామిలటరీ బలగాలు, రక్షణ బలగాలను మొహరించారు. మొత్తంగా.. ఎత్తైన హిమాలయ కొండల్లో ఎంతో ప్రవిత్రత మధ్య సాగే అమర్నాథ్‌ యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

2023లో 4.45 లక్షల మంది యాత్రికులు, 2022లో 3.65 లక్షల మంది యాత్రికులు దర్శించుకోవడంతో గత మూడేళ్ల నుంచి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. 2021- 2020 కోవిడ్ మహమ్మారి సంవత్సరాలలో ఈ యాత్రికుల సంఖ్య 3.42 లక్షలుగా ఉంది. ఆగస్ట్ 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు ముందు ప్రభుత్వం అకస్మాత్తుగా తగ్గించింది. పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అత్యధిక మంది యాత్రికుల సంఖ్య 2011, 2012లో వరుసగా 6.35 లక్షలు, 6.22 లక్షలు.

గత రెండు దశాబ్దాలలో 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ హత్య తర్వాత లోయలో హింస చెలరేగిన తర్వాత కేవలం 2.2 లక్షల మంది మాత్రమే అమర్ నాథ్ యాత్ర చేశారు. మంచి శివలింగాన్ని సందర్శించారు.

ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..
నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నాటకాలు
నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నాటకాలు
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..