AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో మాదే ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవి మాదే, బీజేపీ నేత తేజస్వి సూర్య

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మే 3 న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థే ఉంటారని ఈ పార్టీ నేత తేజస్వి సూర్య అన్నారు. ఆ రాష్ట్రంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ....

బెంగాల్ లో మాదే ప్రభుత్వం,  ముఖ్యమంత్రి పదవి మాదే, బీజేపీ నేత తేజస్వి సూర్య
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 04, 2021 | 6:07 PM

Share

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మే 3 న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థే ఉంటారని ఈ పార్టీ నేత తేజస్వి సూర్య అన్నారు. ఆ రాష్ట్రంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇక మా పార్టీ అధికారంలో ఉంటే అక్కడ రక్తపాతం, రాజకీయ హత్యలు ఉండవన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ని ఇంటికి పంపడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. తాము ఐదేళ్ళక్రితమే బెంగాల్ ఎన్నికల్లో విజయం కోసం కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్  ఓటమి ఇక  ఖాయమన్నారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ 18 సీట్లను గెలుచుకుందని,  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని దిలీప్ ఘోష్ అన్నారు.

అటు-బెంగాల్ లో ఈ సారి త్రిముఖ పోటీ జరగనుంది. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంటున్నారు. ఏమైనా బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోరాడనున్నాయి.కాగా- ఈ ఎన్నికల్లో మమతనేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి తాము మద్దతునిస్తున్నట్టు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ప్రకటించగా.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మా సపోర్ట్ మీకే అని స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఈ ప్రకటన చేయడం తృణమూల్ కాంగ్రెస్ కి ఒక విధంగా వరమే అంటున్నారు. బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు ఈ మూడు పార్టీలు చేతులు కలపడం విశేషం. 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల ముందే ఇలా భావ సారూప్యం గల పార్టీలు ఒకదానికొకటి మద్దతు ప్రకటించుకోవడం వల్ల తృతీయ కూటమి ఏర్పాటుకు అది దారి తీయవచ్చునని అంటున్నారు. అయితే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా కరిష్మా కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ కానుందన్న విషయం కూడా విస్మరించరాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వీరి కరిష్మాను ఎదుర్కొని టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ ఏ విధంగా సాగుతాయన్నది చూడాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

కరాచీ బేకరీని క్లోజ్ చేసిన యాజమాన్యం.. క్రెడిట్ మాదే అంటున్న అధికార పార్టీ

బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా