Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పోరేటర్ల భర్తలైతే ఏంటి.. మీకు ఇక్కడేం పని.. మున్సిపల్‌ కార్యాలయంలో ముచ్చెమటలు పట్టించిన ఆ ఏసీపీ

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా కార్పోరేటర్ భర్తలకు పరాభవం ఎదురయ్యింది. కార్పొరేషన్ ఆవరణలో ప్రారంభించిన దీక్షా దివస్..

కార్పోరేటర్ల భర్తలైతే ఏంటి.. మీకు ఇక్కడేం పని.. మున్సిపల్‌ కార్యాలయంలో ముచ్చెమటలు పట్టించిన ఆ ఏసీపీ
Follow us
K Sammaiah

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2021 | 8:24 AM

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా కార్పోరేటర్ భర్తలకు పరాభవం ఎదురయ్యింది. కార్పొరేషన్ ఆవరణలో ప్రారంభించిన దీక్షా దివస్ పైలాన్ కార్యక్రమానికి మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు హాజరయ్యారు. వీరిలో మరుపల్లి రవి,మేడిది మధు సూధన్, యేలుగం సత్యనారాయణ, ఎండీ,మాక్సూద్, కేషబోయిన శ్రవణ్, సోమిశెట్టి ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

పైలాన్ ఏర్పాటు ను వ్యతిరేకించిన బీజేపీ జిల్లా శ్రేణులు కార్పొరేషన్ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి రావడం తో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి కూల వాతావరనాన్ని గమనించిన ఏసీపీ కలకోట్ల గిరికుమార్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. కమీషనర్ ను కలిసి వినతి పత్రం అంద జేయడానికి పరిమితి సంఖ్యలో బీజేపీ శ్రేణులకు అనుమతి ఇచ్చాడు.

కార్పొరేషన్ లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది మినహా అందరిని కార్యాలయం బయటకు పంపించారు. అప్పటికే మేయర్ ఛాంబర్లో కాలక్షేపం చేస్తూ కూర్చున్న కార్పొరేటర్ల భర్తలను ఏసీపీ స్వయంగా వెల్లి బయటకు పంపించాడు. కార్పొరేషన్ ఆవరణలో సమావేశానికి సంబంధం లేని వారు అధికార పార్టీ నాయకులు అయినా ఉండడానికి వీలు లేదని హెచ్చరించారు.

ఛాంబర్లో కూర్చొని భాతకాని కొట్టే అలవాటు ఉన్న కార్పొరేటర్ల భర్తలు ఏసీపీ వార్నింగ్ తో కంగు తిన్నారు. చేసేదేం లేక కామ్‌గా బయటకు వెళ్లిపోయారు.

Rea more:

లోటస్‌పాండ్‌లో అందరి చూపులు ఆ ఫ్లెక్సీల వైపే.. ఇంతకీ ఫ్లెక్సీలపై ఏం రాశారో తెలుసా..?

అన్న మీద కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ ఇక్కడేం పని..? బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందన్న వీహెచ్‌