AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగనన్న సైనికుల్లారా.. ఈ పది రోజులు అప్రమత్తంగా ఉండండి

జగనన్న సైనికుల్లారా ఈ పది రోజులు అప్రమత్తంగా ఉండండి అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు విజయ సాయి రెడ్డి. ‘‘ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది. ఈ పది రోజులు జగనన్న సైనికులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలి. ప్రత్యర్థులు […]

జగనన్న సైనికుల్లారా.. ఈ పది రోజులు అప్రమత్తంగా ఉండండి
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 03, 2019 | 4:54 PM

Share

జగనన్న సైనికుల్లారా ఈ పది రోజులు అప్రమత్తంగా ఉండండి అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు విజయ సాయి రెడ్డి.

‘‘ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది. ఈ పది రోజులు జగనన్న సైనికులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలి. ప్రత్యర్థులు అన్ని రకాల మాయోపాయాలకు పాల్పడతారు. వాటిని తిప్పికొట్టాలి. సంపూర్ణ విజయం సాధించాలి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

Follow Us