AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ పాలిటిక్స్.. పరస్పర ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులు, లోకేష్ బయటకు వస్తున్నారంటే తడుపుకుంటున్నారన్న పిల్లి

గుంటూరులో రాజకీయం రంజుగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. లోకేష్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఫిర్యాదు చేయగా,

హాట్ పాలిటిక్స్.. పరస్పర ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులు, లోకేష్ బయటకు వస్తున్నారంటే తడుపుకుంటున్నారన్న పిల్లి
Pilli Manikyalarao
Venkata Narayana
|

Updated on: Aug 18, 2021 | 3:05 PM

Share

Guntur Politics: గుంటూరులో రాజకీయం రంజుగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. లోకేష్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఇవాళ గుంటూరు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో దళిత యువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపబడిందన్న ఆయన, విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన నారా లోకేష్, టీడీపీ నేతలను వైసీపీ రౌడీమూకలు ఎందుకు అడ్డుకున్నాయని నిలదీశారు.

నారా లోకేష్ మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడకుండా, డీఎస్పీ ఎందుకు తన కారులో తీసుకెళ్లారని మాణిక్యరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. లోకేష్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తడుపుకుంటున్నారన్నారని పిల్లి ఎద్దేవా చేశారు. లోకేష్‌ను ఆపడం వైసీపీ రౌడీమూకలు, పోలీసులు వల్లకాదన్నారాయన.

దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించిన పిల్లి మాణిక్యాలరావు, చీరాలలో కిరణ్ కుమార్‌ను కొట్టి చంపినప్పుడు, దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు నాగార్జున ఎక్కడ పడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా ఉంటే, చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారని వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఆట‌లు ఈ రాష్ట్రంలో చెల్లవ‌ని హెచ్చరించారు. టీడీపీ నేతలు యువతి మృతదేహాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. రమ్య హత్య ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారని మేరుగ పేర్కొన్నారు.

యువతి మృతదేహం ఉన్న వాహనాన్ని టీడీపీ జెండాలు వేసుకుని ఆపుతారా…? ఇది శవ రాజకీయం కాదా..? వచ్చిన లోకేష్ ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా…? అంటూ మేరుగ ప్రశ్నించారు.

జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?