AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం : తమ్మినేని

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని.. వామపక్ష శక్తుల బలం పెంచడం రెండో లక్ష్యం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. సీపీఐతో ఎన్నికల్లో అంగీకారం కుదిరింది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో సీపీఐ, సీపీఎంలు పోటీ చేస్తాయని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఉన్న బలల ఆధారంగా […]

బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం : తమ్మినేని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 3:46 PM

Share

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని.. వామపక్ష శక్తుల బలం పెంచడం రెండో లక్ష్యం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. సీపీఐతో ఎన్నికల్లో అంగీకారం కుదిరింది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో సీపీఐ, సీపీఎంలు పోటీ చేస్తాయని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఉన్న బలల ఆధారంగా పరిమితమైన పోటీకి సన్నద్ధం అయ్యాం అని తెలిపారు. కాగా శనివారం నల్లగొండ, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. కొన్ని చోట్ల బీఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు రంగంలో ఉంటారని తెలిపారు. ఇక తాము పోటీ చేయని చోట బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ చెప్తున్నట్లుగా వారు 16 స్థానాల్లో గెలిచినా చేసేది ఏమి లేదని ఆయన విమర్శించారు.