మోదీ, అమిత్ షాపై సీతారాం ఏచూరీ తీవ్ర విమర్శలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ. పశ్చిమ బెంగాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ మహా భారతం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ‘100 మంది కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసనుల పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ (భాజపా)లోనూ మనం ఎంతమంది పేర్లను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. కేవలం మోదీ-అమిత్ […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ. పశ్చిమ బెంగాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ మహా భారతం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ‘100 మంది కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసనుల పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ (భాజపా)లోనూ మనం ఎంతమంది పేర్లను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. కేవలం మోదీ-అమిత్ షా పేర్లు మాత్రమే. మహా భారతంలో చివరకు కౌరవులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో.. అటువంటి పరిస్థితులనే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రాజకీయ మహాభారతంలో భాజపా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏడు దశల్లో ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న జరిగిన మూడో దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 5 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 29న రాష్ట్రంలోని మరో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014 ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 34 సీట్లను గెలుచుకుంది. ఈ సారి అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. టీఎంసీ, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.