AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. టీ కాంగ్రెస్‌లో కొత్త ‘రచ్చ’

తెలంగాణ కాంగ్రెస్‌‌లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుండగా.. మరోవైపు నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తన సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ […]

ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. టీ కాంగ్రెస్‌లో కొత్త ‘రచ్చ’
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 19, 2019 | 7:36 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌‌లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుండగా.. మరోవైపు నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తన సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో బుధవారం భేటీ అయి ఫిర్యాదు చేశారు.

ఉత్తమ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. హుజుర్ నగర్ టికెట్ అంశంపై ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కుంతియాను కోరినట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై సానుకూలంగా స్పందించిన కుంతియా.. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని రేవంత్‌కు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.

అయితే తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన అందులో గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికకు తన భార్య పద్మావతిని బరిలో నిలుపుతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించి స్థానిక నేతలతో ప్రచారం కూడా చేయిస్తున్నారు. దీనిని రేవంత్ వర్గం వ్యతిరేకిస్తోంది. అక్కడి నుంచి శ్యామలా కిరణ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌పై కుంతియాకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర