AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశమంటే తెలుగుదేశం కాదోయ్:కేశినేనికి పీవీపీ ఘాటు కౌంటర్

టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీ మధ్య ట్విట్టర్‌ వార్ ముదురుతోంది. చిన్న సమస్యకు పరిష్కారం చూపని సీఎం జగన్ రాష్ట్రంలోని పెద్ద పెద్ద సమస్యలను ఎలా పరిష్కారంటూ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కేశినేని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘‘మీకు చేతకాకపోతే చెప్పండి జగన్ గారూ.. నేను చేసి చూపిస్తా.. మీరు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చు’’ అంటూ వ్యంగంగా కామెంట్ చేశారు. https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/posts/1256748451172685 దీనిపై పీవీపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ కవి […]

దేశమంటే తెలుగుదేశం కాదోయ్:కేశినేనికి పీవీపీ ఘాటు కౌంటర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 9:10 AM

Share

టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీ మధ్య ట్విట్టర్‌ వార్ ముదురుతోంది. చిన్న సమస్యకు పరిష్కారం చూపని సీఎం జగన్ రాష్ట్రంలోని పెద్ద పెద్ద సమస్యలను ఎలా పరిష్కారంటూ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కేశినేని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘‘మీకు చేతకాకపోతే చెప్పండి జగన్ గారూ.. నేను చేసి చూపిస్తా.. మీరు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చు’’ అంటూ వ్యంగంగా కామెంట్ చేశారు.

https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/posts/1256748451172685

దీనిపై పీవీపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు రాసిన ‘దేశమును ప్రేమించుమన్నా’ గేయంలోని వ్యాఖ్యలను తీసుకున్న పీవీపీ, కేశినేనికి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒట్టి మాటలు కట్టుబెట్టి గట్టి మేలు తలపెట్టవోయి. సొంత లాభం కొంత మానుకుని, పొరుగువారికి తోడుపడవోయ్. దేశమంటే తెలుగుదేశం కాదోయ్. నువ్వు జీతాలు ఎగ్గొట్టిన కార్మికులు కూడా మనుషులోయ్. కాస్త వారి కష్టాలు చూడవోయ్’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.