నీరవ్ మోదీ అరెస్ట్పై ప్రియాంక కామెంట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ అరెస్ట్పై కాంగ్రెస్ యూపీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు. నీరవ్మోదీ అరెస్టుతో ఇప్పుడేదో ఘనత సాధించినట్టు ఎన్డీఏ ప్రభుత్వం గొప్పలకు పోతోందని ఆమె విమర్శించారు. ఇది ఎన్నికల ఎత్తుగడ అని, అసలు నీరవ్ను లండన్కు పారిపోయేలా చేసింది ఎవరంటూ ఆమె ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తోన్న ప్రియాంక గాంధీ, ఇటీవల పుల్వామా దాడిలో మరణించిన సైనిక కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ […]
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ అరెస్ట్పై కాంగ్రెస్ యూపీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు. నీరవ్మోదీ అరెస్టుతో ఇప్పుడేదో ఘనత సాధించినట్టు ఎన్డీఏ ప్రభుత్వం గొప్పలకు పోతోందని ఆమె విమర్శించారు. ఇది ఎన్నికల ఎత్తుగడ అని, అసలు నీరవ్ను లండన్కు పారిపోయేలా చేసింది ఎవరంటూ ఆమె ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తోన్న ప్రియాంక గాంధీ, ఇటీవల పుల్వామా దాడిలో మరణించిన సైనిక కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోదీని లండన్లోని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చారు. ఆ తరువాత నీరవ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని తిరస్కరించిన కోర్టు మార్చి 29వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.