దేశంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు

ప్రముఖ నాయకుడి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఓ మహిళ లోక్‌సభ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు, వాజ్‌పేయి, నరేంద్రమోదీ లాంటి మహామహులకే సాధ్యం కాని రికార్డు ఆమె పేరిట‌ లిఖితమైంది. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి గెలిచిన గోపీనాథ్ ముండే మోదీ కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా […]

దేశంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 2:46 PM

ప్రముఖ నాయకుడి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఓ మహిళ లోక్‌సభ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు, వాజ్‌పేయి, నరేంద్రమోదీ లాంటి మహామహులకే సాధ్యం కాని రికార్డు ఆమె పేరిట‌ లిఖితమైంది.

2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి గెలిచిన గోపీనాథ్ ముండే మోదీ కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మే 26న బాధ్యతలు చేపట్టిన ఆయన పది రోజులు గడవక ముందే జూన్ 3న ఢిల్లీలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో ఖాళీ అయిన బీడ్ నియోజకవర్గంలో ఉప‌ఎన్నికలు అనివార్యయ్యాయి. ముండే వారసురాలిగా ఆయన రెండో కుమార్తె ప్రీతమ్ పోటీ చేసి ఏకంగా 6,96,321 మెజార్టీలో విజయకేతనం ఎగురవేశారు.

2004 ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్‍లోని ఆరామ్‌బాగ్ నుంచి పోటీ చేసిన అనిల్ బసు 5,92,502 ఆధిక్యంతో గెలుపొందారు. పదేళ్ల తర్వాత ఆయన రికార్డును ప్రీతమ్ తిరగరాశారు. వారి తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(5.80లక్షలు, నంద్యాల, 1991), నరేంద్రమోదీ(5.70లక్షలు, వడోదర, 2014), వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(5.45లక్షలు, కడప, 2011ఉపఎన్నికలు) ఉన్నారు.