వారణాసిలో తేజ్ బహదూర్ కి చుక్కెదురు…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆఖరి క్షణంలో సమాజ్వాదీ పార్టీ ఎన్నికల బరిలోకి దింపిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు ఈసీ షాకిచ్చింది. ఎలక్షన్ కమిషన్ యాదవ్కు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. షాలినీ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు… హడావిడిగా తేజ్బహదూర్తో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. ఈ లోపాన్ని […]

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆఖరి క్షణంలో సమాజ్వాదీ పార్టీ ఎన్నికల బరిలోకి దింపిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు ఈసీ షాకిచ్చింది. ఎలక్షన్ కమిషన్ యాదవ్కు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. షాలినీ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు… హడావిడిగా తేజ్బహదూర్తో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. ఈ లోపాన్ని కనుగొన్న ఈసీ ఆయనకు నోటీసిచ్చి మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆయన సమర్పించిన రెండు నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్న కారణంగా వాటిని తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారులుతెలిపారు.
సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని, నాణ్యమైన భోజనం దక్కడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. దీంతో ఆయనను ఆర్మీ డిస్మిస్ చేసింది. తరువాత రాజకీయాల్లో చేరిన తేజ్ బహదూర్కు ఎస్పీ టికెట్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం అవినీతి , దేశద్రోహం ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిస్ అయిన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది తేజ్ బహదూర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంది.



