AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవనిగడ్డ సభ వెలవెల

అవనిగడ్డ ప్రజలు బీజేపీకి షాకిచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ పాల్గొన్న సభకు జనం కరువయ్యారు. ఈ సభ కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసినా.. రాజ్‌నాథ్‌ ప్రసంగిస్తున్నప్పుడు సభలో చాలా వరకూ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్ర నేతలపై రాజ్‌నాథ్‌ తీవ్ర అసహనం వ్య క్తం చేశారు. అవనిగడ్డ సభ అనంతరం ఆయన విజయవాడ రావాల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. కనీసం విలేకర్లతో మాట్లాడేందుకైనా విజయవాడ రావాలని నేతలు ఎంత బతిమాలినా […]

అవనిగడ్డ సభ వెలవెల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2019 | 6:10 PM

Share

అవనిగడ్డ ప్రజలు బీజేపీకి షాకిచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ పాల్గొన్న సభకు జనం కరువయ్యారు. ఈ సభ కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసినా.. రాజ్‌నాథ్‌ ప్రసంగిస్తున్నప్పుడు సభలో చాలా వరకూ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్ర నేతలపై రాజ్‌నాథ్‌ తీవ్ర అసహనం వ్య క్తం చేశారు. అవనిగడ్డ సభ అనంతరం ఆయన విజయవాడ రావాల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. కనీసం విలేకర్లతో మాట్లాడేందుకైనా విజయవాడ రావాలని నేతలు ఎంత బతిమాలినా ససేమిరా అన్నారు. షాక్‌ తిన్న బెజవాడ బీజేపీ నేతలు… రాజ్‌నాథ్‌ హెలికాప్టర్‌ పాడైందని, గంటన్నరకుపైగా ఆలస్యం అవుతుందని చెప్పి… విలేకర్లు తమంతట తాము వెళ్లిపోయేలా చేశారు.

Follow Us