పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారా? ఆహక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారన్న మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారా? ఆహక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారన్న మంత్రి పెద్దిరెడ్డి
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:54 PM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతాయని… అలాంటప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు ఏనాడు ప్రజల కోసం పని చేయలేదని పెద్దిరెడ్డి విమర్శించారు. సొంత జిల్లాలో కూడా మెజారిటీ తెచ్చుకోలేని నేత అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్‌ఈసీ ఇష్టానుసారంగా ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయతీ 2002 నుంచి వస్తోందని వివరించారు. ఇప్పుడు ఏకగ్రీవాలు చెల్లవనడానికి చంద్రబాబు ఎవరని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.