AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎంసీలో ఇకపై ‘కాంగ్రెస్’ పదం కనిపించదు

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడకుండా లోగోను విడుదల చేసింది. గతంలో ఆ పార్టీ లోగోల్లో తృణమూల్‌ పక్కనే కాంగ్రెస్‌ అనే పదం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త  ఫార్మా‌ట్ మాత్రమే వాడుకలో ఉంటుందని స‌ృష్టం చేసింది. మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో […]

టీఎంసీలో ఇకపై ‘కాంగ్రెస్’ పదం కనిపించదు
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2019 | 7:13 PM

Share

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడకుండా లోగోను విడుదల చేసింది. గతంలో ఆ పార్టీ లోగోల్లో తృణమూల్‌ పక్కనే కాంగ్రెస్‌ అనే పదం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త  ఫార్మా‌ట్ మాత్రమే వాడుకలో ఉంటుందని స‌ృష్టం చేసింది. మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో విభేదించి .. టీఎంసీని స్థాపించారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత తమ పార్టీ లోగోల్లోంచి ‘కాంగ్రెస్‌’ అనే పదాన్ని తొలగించింది టీఎంసీ . ఆ పార్టీ కొత్త లోగోలో తృణమూల్‌ అనే పదం ఆకుపచ్చ రంగులో కనపడుతోంది. దానిపై రెండు పుష్పాలు ఉన్నాయి. వెనకవైపున నీలిరంగు ఉంటుంది.

తమ పార్టీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లోనూ కాంగ్రెస్‌ అనే పదాన్ని తొలగించారు. అయితే, ఎన్నికల సంఘం వద్ద నమోదైన పేరులో మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌గానే ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.