AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 ఏళ్ల థాకరే కుటుంబం కోట బద్దలైంది… BMCలో బీజేపీ-శివసేన అజేయమైన విక్టరీ

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై థాకరే కుటుంబం దీర్ఘకాలంగా కొనసాగిన ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇప్పుడు, చాలా కాలం తర్వాత, ముంబైకి బీజేపీ-శివసేన (షిండే వర్గం) నుండి మేయర్ రానున్నారు.

27 ఏళ్ల థాకరే కుటుంబం కోట బద్దలైంది... BMCలో బీజేపీ-శివసేన అజేయమైన విక్టరీ
Devendra Fadnavis, Uddhav Thackeray, Raj Thackeray
Balaraju Goud
|

Updated on: Jan 17, 2026 | 7:43 AM

Share

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై థాకరే కుటుంబం దీర్ఘకాలంగా కొనసాగిన ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇప్పుడు, చాలా కాలం తర్వాత, ముంబైకి బీజేపీ-శివసేన (షిండే వర్గం) నుండి మేయర్ రానున్నారు.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక సృష్టించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో, బీజేపీ బిఎంసిలోని 227 వార్డులలో 89 గెలుచుకుంది. ఇది 2017లో సాధించిన 82 సీట్లతో మునుపటి అత్యధిక సంఖ్యను అధిగమించింది. ముంబైలో దాని మిత్రపక్షమైన శివసేన 29 సీట్లను గెలుచుకుంది. కూటమి మొత్తం సంఖ్యను 118 స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. కూటమి 114 మంది సభ్యుల మెజారిటీని సులభంగా అధిగమించింది.

నిజానికి, ఈసారి, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనతో పొత్తు పెట్టుకుని, ఠాక్రే కుటుంబ కోటలో ఒక చీలికను తెచ్చిపెట్టింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 227 సీట్లలో 118 సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజారిటీ మ్యాజిక్ సంఖ్యను దాటింది. వీటిలో బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా, షిండే శివసేన 29 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కూటమి 72 సీట్లు గెలుచుకుంది.

1997 నుండి అధికారంలో శివసేన

1997 నుండి అవిభక్త శివసేన బిఎంసిలో హవా కొనసాగిస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో, శివసేన (యుబిటి) 65 సీట్లు గెలుచుకుంది. రాజ్ థాకరేకు చెందిన ఎంఎన్ఎస్ ఆరు, ఎన్‌సిపి (శరద్ పవార్) ఒక సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ 24 సీట్లు సాధించింది. ఎఐఎంఐఎం ఎనిమిది, ఎన్‌సిపి (అజిత్ పవార్) మూడు, సమాజ్‌వాదీ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. ఈసారి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు.

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

ముంబై మున్సిపల్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను ఆశీర్వదించినందుకు ముంబై ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బిఎంసి ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం సాధించిన తరుణంలో, “ఎన్‌డిఎను ఆశీర్వదించినందుకు ముంబైలోని నా సోదరసోదరీమణులకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముంబై మన దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇది కలల నగరం, మన అభివృద్ధిని వేగవంతం చేసే నగరం. మహారాష్ట్ర శక్తివంతమైన సంస్కృతికి ముంబై ఉత్తమ ప్రతిబింబమని ఆయన అన్నారు. “ఈ గొప్ప స్ఫూర్తితో ప్రేరణ పొంది, నగర ప్రజలకు సుపరిపాలన, జీవన సౌలభ్యాన్ని అందిస్తాము” అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

227 మంది సభ్యులున్న BMCలో మెజారిటీ సంఖ్య 114. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థ అయిన BMC 2025-26 సంవత్సరానికి రూ. 74,427 కోట్ల బడ్జెట్‌ను కలిగి ఉంది. ముంబై ఇతర 28 మున్సిపల్ సంస్థలకు జరిగిన ఎన్నికల తర్వాత శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఓటర్ల సంఖ్య 54.77 శాతంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..