AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీ తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారత్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ..

శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 1:53 PM

Share

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీని తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారతీయ హిందువుల విశ్వాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. దేశంలోని ఎంతో మంది భక్తులు తమ ఆరాధ్య దైవంగా, ఆదర్శప్రాయంగా కొలుచుకునే శ్రీరాముడు ఓ నేపాలీ అని, భారతీయుడు కాదంటూ ఓలీ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని ఓలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రాముని జన్మస్థలం విషయంలో భారత్ వాస్తవాలు వక్రీకరిస్తుందంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యానించారు. నిజమైన అయోధ్య భారత్‌లో లేదన్నారు. నేపాల్ దేశంలోని పశ్చిమ బిర్గుంజ్‌కు సమీపంలోని థోరి గ్రామంలో ఉందని తెలిపారు. దశరథుని కుమారుడైన రాముడు భారతీయుడు కాదని అన్నారు. అయోధ్య థోరీలో ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తమ దేశంలో రాముడి జన్మస్థలం ఉందని పేర్కొంటోందని ఓలీ వ్యాఖ్యానించారు. వాల్మికీ ఆశ్రమం కూడా నేపాల్‌లో ఉందన్నారు. పుత్రుల కోసం దశరథుడు యాగం నిర్వహించిన చోటు రిధి, ఇది కూడా నేపాల్‌లోనే ఉందని ఓలీ వాదించారు. అసలు అయోధ్య భారత్‌లో కాదు నేపాల్‌లో ఉందని ఆయన వాదించారు. ఈమేరకు నేపాల్ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.

గత కొద్ది కాలంగా భారత్ – నేపాల్ మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ఇటీవల మన దేశ సరిహద్దులోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్‌పైనా నేపాల్ ప్రభుత్వం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్ నేపాల్‌లో తమ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుపై అధికార నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ మండిపడుతోంది. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ.. పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు

Follow Us
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.