గుండెనిండా దేశభక్తి.. గుర్రాలతో నిరసన.. ఆ గిరిజనుల ఆవేదన ఎందుకో తెలుసా..?
వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామంలో నివాసం.. ఇరవై రెండు కుటుంబాలు నూటా ఇరవై మంది వరకు జనాభా.. పశువుల బంధ, జీలుగు లోవ, సోంపురం గ్రామాల్లో సామాలమ్మ కొండపై జీవనం.. కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగుతున్నారు... కనిపించిన వారందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఇక గళం విప్పారు.. స్వాతంత్ర దినోత్సవ వేళ త్రివర్ణ పతాకాలతో గుర్రాలపైనే ర్యాలీ చేశారు.. గుర్రాలతో మూడు కిలోమీటర్ల నిరసన యాత్ర చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేళ గుండె నిండా దేశభక్తి ఉన్నా.. పాలకులు తమ కష్టాలు తీర్చడం అందుకు ఆవేదన చేంతున్నారు ఆ అడవి బిడ్డలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
