కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?

ఏపీ బిజెపి అధ్యక్షునికి కొత్త చిక్కొచ్చిపడింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆశించిన స్పందన లేకపోవడంతో లోతులకు వెళ్ళిన ఏపీ బిజెపి నాయకత్వానికి షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. దాంతో ఢిల్లీలోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వరకు ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే. కానీ.. మొన్నటి ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి పుంజుకోవడం మొదలైంది. మారిన ఏపీ రాజకీయాలు దానికి ఒక కారణమైతే.. కేంద్రంలో బిజెపి బలమైన శక్తిగా […]

కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?
Follow us

|

Updated on: Nov 12, 2019 | 7:10 PM

ఏపీ బిజెపి అధ్యక్షునికి కొత్త చిక్కొచ్చిపడింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆశించిన స్పందన లేకపోవడంతో లోతులకు వెళ్ళిన ఏపీ బిజెపి నాయకత్వానికి షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. దాంతో ఢిల్లీలోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చినట్లు తెలుస్తోంది.

ఏడాది క్రితం వరకు ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే. కానీ.. మొన్నటి ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి పుంజుకోవడం మొదలైంది. మారిన ఏపీ రాజకీయాలు దానికి ఒక కారణమైతే.. కేంద్రంలో బిజెపి బలమైన శక్తిగా ఎదిగిపోవడమే ఇంకో కారణం. సంఖ్యాబలంలోను.. రాజకీయ బలంలోను.. ప్రభుత్వంలో వుండడం వల్లను.. బిజెపికి ఏపీలో వేళ్ళూనుకోవాలన్నఆకాంక్షకు అనుకూల వాతావరణం కనిపించింది. దానికి తోడు అయిదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేని రాజకీయ నాయకుల సంఖ్య పెరిగి పోవడం కూడా బిజెపికి కలిసి వచ్చేలా చేసింది. ఫలితంగా ఏపీలో బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు భారీగా స్పందన వుందన్న కథనాలొచ్చాయి.

సార్వత్రిక ఎన్నికలు అలా ముగిసాయో లేదో.. టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు చంద్రబాబుకు హ్యాండిచ్చి బిజెపిలో విలీనమైపోయారు. వారిలో సుజనా చౌదరి బిజెపిలో కీలకంగా మారిపోయారు కూడా. అదే ఊపులో పలువురు టిడిపి, కాంగ్రెస్ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది. తొలుత జేష్ట్య మాసం ముగిసాక శ్రావణ మాసంలో కమలాకర్ష్‌కు భారీ స్పందన వుంటుందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి..ఇలా వాయిదాల మీద వాయిదాలు వస్తూ వెళుతూ వుండడం జరిగిపోయింది. కానీ బిజెపి నేతలు క్లెయిమ్ చేసుకున్న నేతలు మాత్రం కమలం పార్టీలోకి రాలేదు.

అయితే.. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పలువురి ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపి ఒప్పిస్తున్నా.. ఆ తర్వాత వారు మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణం బిజెపిలో ఇటీవల చేరిన ఇద్దరు నేతలేనన్న నిర్ధారణకు బిజెపి నాయకత్వం వచ్చినట్లు సమాచారం. గంటా శ్రీనివాస్ రావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కరణం బలరామ్ ఇలా పలువురు బిజెపిలో నేడో, రేపో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ వీరెవరూ ఇంత వరకు బిజెపి తీర్థం పుచ్చుకోలేదు. కమలం కండువా కప్పుకోలేదు. ఒక దశలో 16 మంది టిడిపి ఎమ్మెల్యేలు, దాదాపు అంతే సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు బిజెపికి టచ్‌లో వున్నారని బిజెపి నేతలు ఆంతరంగిక భేటీల్లో చెప్పుకున్నారు. అయితే వీరిలో ఒక్కరూ బిజెపిలో చేరలేదు.

కారణమేంటా అని బిజెపి ఏపీ అధ్యక్షుడు మధన పడుతూ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించినట్లు సమాచారం. దాంతో వారు అనుమానమొచ్చిన కొందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా పార్టీ రాష్ట్ర స్థాయి కోర్ కమిటీలో ఓపెన్‌గానే చేరికలపై చర్చించిన కన్నా.. ఆ తర్వాత వాటిని సీక్రెట్‌గా తానే స్వయంగా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దాంతో కన్నా మూవ్ మెంట్‌పై, ఆయన్ను కలుస్తున్న నేతలపై మరికొందరు కన్నేశారని తెలుస్తోంది. ఈ రకంగా ఏపీ బిజెపిలో ఇంటి వ్యక్తులే కొత్త వారి రాకను అడ్డుకుంటున్నట్లు వెల్లడైందని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కన్నాకు వచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలున్నాయని తెలుస్తోంది. బిజెపిలోకి రావాలనుకుంటున్న వారిని వారిస్తోంది ఎవరో కాదు.. మొన్నటి ఎన్నికల తర్వాత బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లేనని కన్నాకు సమాచారమందిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే తాను ఒప్పించిన నేతలు తర్వాత తనకు మొహం చాటేస్తున్నారని కన్నా ఆగ్రహంతో వున్నారని తెలుస్తోంది. తన శ్రమ అంతా వృధా అవుతుందన్న ఫీలవుతున్నారని సమాచారం.

ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించిన తర్వాత బిజెపి అధినేతలు అమిత్ ‌షా, జె.పి.నడ్డాలను కలిసేందుకు కన్నా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సో.. పార్టీ ఎదగ ముందే ఇంటిపోరుతో కమలం పార్టీకి కుదేలవుతుందన్న మాట. ఇది ఆధిపత్య పోరా లేక చంద్రబాబు డైరెక్షన్‌లోజరుగుతున్న వెన్నుపోటా అన్నది కమలం నేతలకు అంతు చిక్కడం లేదని సమాచారం.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..