ఈ సారి లోక్సభకు పోటీ చేయను : బీజేపీ ఎంపీ
లక్నో : వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత దేవరియో ఎంపీ కల్రాజ్ మిశ్రా. లక్నోలో హోళీ పండుగ జరుపుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ తనకు కీలక బాధ్యతలు అప్పజెప్పిందని.. వాటిని నెరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయఖేతనం ఖాయమన్నారు. ఉత్తర్ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని.. మరోసారి కాంగ్రెస్ పార్టీని […]
లక్నో : వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత దేవరియో ఎంపీ కల్రాజ్ మిశ్రా. లక్నోలో హోళీ పండుగ జరుపుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ తనకు కీలక బాధ్యతలు అప్పజెప్పిందని.. వాటిని నెరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయఖేతనం ఖాయమన్నారు. ఉత్తర్ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని.. మరోసారి కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం ఖాయమని కల్రాజ్ మిశ్రా స్పష్టం చేశారు.