AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: తెలంగాణలో ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

డ్రగ్స్‌ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి తెలంగాణలో ఏర్పండిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay:  తెలంగాణలో ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay
Sanjay Kasula
|

Updated on: Apr 08, 2022 | 7:40 PM

Share

డ్రగ్స్‌ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్‌(Udta Hyderabad) సినిమా తీసే పరిస్థితి తెలంగాణలో ఏర్పండిందని బీజేపీ(BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోయిందంటే డ్రగ్స్‌ దందానే కారణమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న యువత తల్లిదండ్రులు తమ పిల్లలు డగ్స్‌ బారిన పడతారేమోనని ఆందోళన చెందుతున్నారని.. డ్రగ్స్‌ తీసుకుంటున్నారని తెలిసి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులను తొలగించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఎద్దేవ చేశారు.

టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్‌ సన్నిహితుల హస్తం ఉన్నందునే డ్రగ్స్‌ దందా కొనసాగుతోందని బండి సంజయ్‌ ఆరోపించారు. డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. వెయ్యి మందితో కమిటీ వేసి డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారని.. ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు.

2015 నాటి డ్రగ్స్‌ కేసు విచారణ మరుగున పడేశారని.. కొందరి పేర్లు లీక్‌ చేసినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ఏ కేసు గురించైనా ముందుగా సీఎం హల్‌చల్‌ చేస్తారు.. ఆ తర్వాత మరుగున పడేస్తారని బండి సంజయ్ ఎద్దేవ చేశారు. డ్రగ్స్‌ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినా.. రాష్ట్ర సర్కార్ స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించిందని బండి సంజయ్‌ గుర్తు చేశారు.

ఇక గవర్నర్‌కు, గవర్నమెంట్‌కు జరుగుతున్న ఇష్యూపై రియాక్ట్‌ అయ్యారు బండి సంజయ్‌. గవర్నర్ తమకు ఏజెంట్‌గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. గవర్నర్‌ తమిళిసై ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదన్నారు బండి సంజయ్‌. నిబంధనలకు విరుద్ధంగా కళ్లు మూసుకుని సంతకాలు చేయాలా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు