TDP: మీ వెంట్రుకలు పీకే తీరిక మాకు లేదు.. జగన్ కామెంట్స్‌పై తెలుగు దేశం నాయకుల ఫైర్..

నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి..

TDP: మీ వెంట్రుకలు పీకే తీరిక మాకు లేదు.. జగన్ కామెంట్స్‌పై తెలుగు దేశం నాయకుల ఫైర్..
Lokesh On Cm Jagan
Follow us

|

Updated on: Apr 08, 2022 | 7:13 PM

నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) చేసిన కామెంట్స్‌పై తెలుగు దేశం పార్టీ (TDP) నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని భాషనే సిఎం మాట్లాడటం హేయం అని విమర్శించారు. సీఎం జగన్ భాష చూస్తే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉందన్నారు. సెల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు చేస్తుంటే సిగ్గనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు. పాలన చేతగాకే ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు, పత్రికలపై బూతులు మాట్లాడటం శోచనీయమని వర్లరామయ్య అన్నారు.

వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైఎస్ జగన్..

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందరూ ఏకమైనా తనను ఏమీ చేయలేరని, వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? అంటూ లోకేష్ జగన్ తీరును ఎద్దేవా చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైయస్ జగన్ గారు మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు అంటూ లోకేష్ కామెంట్ చేశారు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నామని సెటైర్లు సందించారు లోకేష్.

నంద్యాల సభలో సీఎం జగన్.. 

ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరు ఏం చేయలేరంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan). ఇవేవి నన్ను కదిలించలేవు, బెదిరించలేవు, దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చా. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని కోరుకుంటటున్నానన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మండిపడ్డారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు