AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు ఆ మెజారిటీ రాకపోతే నీ సంగతి చెప్తా

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పాడు. అభిమానులు, మీడియా అని చూడకుండా అందరికీ వార్నింగ్‌లు ఇస్తూ ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న బాలయ్య.. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. ‘‘నాకు మెజారిటీ రాకపోతే నీ సంగతి చెప్తా’’ అంటూ ఓ అభిమానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు. ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచిన బాలయ్య గత కొన్ని రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఆయన పర్యటనలో ఓ అభిమాని.. ‘‘మీరు […]

నాకు ఆ మెజారిటీ రాకపోతే నీ సంగతి చెప్తా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:46 PM

Share

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పాడు. అభిమానులు, మీడియా అని చూడకుండా అందరికీ వార్నింగ్‌లు ఇస్తూ ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న బాలయ్య.. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. ‘‘నాకు మెజారిటీ రాకపోతే నీ సంగతి చెప్తా’’ అంటూ ఓ అభిమానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు.

ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచిన బాలయ్య గత కొన్ని రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఆయన పర్యటనలో ఓ అభిమాని.. ‘‘మీరు 60వేల మెజారిటీతో గెలుస్తారు సార్’’ అంటూ బాలయ్యను ఉత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యలు బాలయ్యకు రుచించలేదు. దీంతో రెచ్చిపోతూ.. ‘‘నీ ఇల్లు ఎక్కడుందో చెప్పురా.. అంత మెజారిటీ రాకపోతే నీ సంగతి చెబుతా’’ అంటూ(రాయలేని విధంగా) కొన్ని దుర్భాషలు మాట్లాడాడు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు పక్కనే బాలయ్య భార్య వసుంధర కూడా ఉన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆమె నవ్వుతూ ఉండటం విశేషం. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.