AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా

నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా
Union Minister Jp Nadda
Balaraju Goud
|

Updated on: Jul 22, 2026 | 9:14 PM

Share

నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నడ్డా, నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా బాధ్యతాయుతంగా చర్చించాలని ప్రతిపక్షాలకు సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల గత పదేళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన ఎందుకు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని నడ్డా ప్రశ్నించారు. విద్యార్థుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మోదీ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి నడ్డా పేర్కొన్నారు. పేపర్ లీక్‌లపై వచ్చిన ప్రతి ఆరోపణను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, అవసరమైన చోట విచారణ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాకుండా పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చ జరగాలని, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జేపీ నడ్డా స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీక్ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us